నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న చిత్రం ‘దసరా’. ఈ సినిమాలో పక్కా మాస్ లుక్ తో నాని కనిపించనున్నాడు. కీర్తి సురేశ్ ఈ సినిమాలో హీరోయిన్గా కనిపించనుంది. ఈ సినిమా తరువాత నాని ఏ దర్శకుడితో ఏ సినిమా చేయనున్నాడనేది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో ఆయన నెక్స్ట్ ప్రాజెక్టు రేపు పూజా కార్యక్రమాలు జరుపుకోనున్నట్టుగా తెలుస్తోంది.
కెరియర్ పరంగా ఇది నానీకి 30వ సినిమా. ఈ సినిమాను మోహన్ చెరుకూరి – విజయేందర్ రెడ్డి నిర్మించనున్నారు. ఈ సినిమాతో కొత్త దర్శకుడు పరిచయం కానున్నాడని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాలో కథానాయిక ఎవరై ఉంటారనే విషయంలో ఊహాగానాలు మొదలైయ్యాయి. ఈ సినిమాలో నాని సరసన ‘సీతారామం’ హీరోయిన్ మృణాళ్ ఠాకూర్ కనిపించనుందని అంటున్నారు. ‘సీతారామం’లో సీత పాత్ర ద్వారా ఆమె తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది.