HomeTelugu Trendingమెగా హీరోలతో బాహుబలి ఫొటో .. ట్రెండింగ్‌

మెగా హీరోలతో బాహుబలి ఫొటో .. ట్రెండింగ్‌

8 18మెగాస్టార్‌ చిరంజీవి, రామ్‌ చరణ్‌ ‘సైరా: నరసింహారెడ్డి’. ఈ చిత్ర టీజర్‌ విడుదల వేడుకను ముంబయిలో నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత రామ్‌చరణ్‌తో కలిసి చిరు ముంబయి వెళ్లారు. మరోపక్క ‘యంగ్‌ రెబల్‌ స్టార్‌’ ప్రభాస్‌ ‘సాహో’ ప్రమోషన్స్‌లో భాగంగా అక్కడే ఉన్నారు. దీంతో ఆయన చిరంజీవి, రామ్‌చరణ్‌లను కలిశారు. ఈ ముగ్గురూ కలిసి దిగిన ఫొటో ప్రస్తుతం సోషల్‌మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది.

‘సైరా’ కు సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా, అమితాబ్‌ బచ్చన్‌, జగపతిబాబు, సుదీప్‌, విజయ్‌ సేతుపతి, నయనతార, తమన్నా, కీలక పాత్రపోషిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ‘సైరా’ ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. ఇక సుజీత్‌ దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా నటించిన ‘సాహో’ ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్రద్ధాకపూర్‌ హీరోయిన్. ‘బాహుబలి’ చిత్రాల తర్వాత ప్రభాస్‌ నటించిన చిత్రం కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. మరోపక్క ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్‌-రామ్‌చరణ్‌ హీరోలుగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్‌ కొమరం భీం పాత్రలో నటిస్తుండగా, రామ్‌చరణ్‌ అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu