పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. తాజాగా ఆయన నటిస్తున్న ప్రాజెక్ట్ కె రిలీజ్ డేట్ ను నిర్మాత ప్రకటించారు. మహా శివరాత్రి సందర్భంగా డార్లింగ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పారు. సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ కొత్త పోస్టర్ ను విడుదల చేశారు. ఈ పోస్టర్ హలీవుడ్ సినిమాలను తలపిస్తుంది.
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో దీపికా పదుకొణె, దిషా పటానీ హీరోయిన్లు నటించనున్నారు. అమితాబ్ కూడా ఇందులో కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది 12న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
వైజయంతీ మూవీస్ తమ 50 ఏళ్ల సినీ ప్రస్థానంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ మూవీని దాదాపు 500 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తోంది. ఈ సినిమా రెండు పార్టులుగా విడుదల కానున్నట్లు టాక్. ఈ వార్తతో ప్రభాస్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ నాలుగు పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు. ఇవి అన్నీ కూడా షూటింగ్ దశలోనే ఉన్నాయి.