‘నానీస్ గ్యాంగ్ లీడర్’ సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ ప్రియాంక అరుళ్ మోహన్. గ్లామర్ పరంగాను .. నటన పరంగాను ఆకట్టుకుంది. ఆ తరువాత శర్వానంద్ జోడీగా ‘శ్రీకారం’ సినిమా కూడా చేసింది. అయితే ఈ రెండు సినిమాలు కూడా ఆశించిన ఫలితాలను అందుకోలేకపోయాయి. దాంతో ప్రియాంక తమిళ సినిమాలపై ఎక్కువగా ఫోకస్ పెట్టి .. అక్కడ వరుస అవకాశాలను అందుకుంటోంది.
తాజాగా మహేశ్ జోడీగా ఈ బ్యూటీని త్రివిక్రమ్ ఎంపిక చేశారనే వార్తలు బలంగా వినిపిస్తోంది. మహేశ్ హీరోగా త్రివిక్రమ్ చేయనున్న సినిమా వచ్చే నెలలో పట్టాలెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి ఒక హీరోయిన్గా పూజ హెగ్డేను తీసుకున్నారు. రెండవ హీరోయిన్గా శ్రీలీల పేరు వినిపించింది. తాజాగా ప్రియాంకా అరుళ్ మోహన్ పేరు తెరపైకి వచ్చింది. హారిక అండ్ హాసిని వారు నిర్మిస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ‘సంక్రాంతి’కి ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు.