ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ‘సలార్’. ‘కేజీఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో వస్తున్న చిత్రమిది. శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో జగపతిబాబు, ఈశ్వరీరావు తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా టీజర్ వచ్చే నెల మొదటి వారంలో రానుందని టాక్ వినిపిస్తోంది. దానికి సంబంధించిన కొన్ని వీడియోలు నెట్టింట దర్శనమిస్తున్నాయి.
కేజీఎఫ్ తర్వాత ప్రశాంత్ నీల్ తీస్తున్న మూవీ కావడం, ఇప్పటికే రిలీజైన పోస్టర్లు అదిరిపోవడంతో అంచనాలు ఆకాశాన్నంటాయి. ఈ నేపథ్యంలో సలార్.. కీలక పాత్రలో నటిస్తున్న నటి శ్రియా రెడ్డి ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
సలార్ సినిమా కేజీఎఫ్కు మించి ఉంటుంది. నేను ఇప్పటి వరకు ఇలాంటి స్క్రిప్ట్, యాక్షన్ను చూడలేదు అని చెప్పారు. ప్రశాంత్ నీల్ ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ లాగా ఒక ప్రపంచాన్ని సృష్టించారని, ఇందులో ప్రభాస్ ఇప్పటి వరకు చూడని విధంగా ఉంటాడని తెలిపారు. ప్రభాస్ స్క్రీన్ మీద కనిపించగానే ప్రేక్షకులు కచ్చితంగా కేరింతలు కొడతారని,సినిమాలోని ప్రతి సన్నివేశం కొత్తగా ఉంటుందని అంచనాలను పెంచేశారు.
ఈ ఏడాది సెప్టెంబర్ 28న సలార్ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ‘ప్రపంచానికి సీపీఆర్ ఇచ్చే సమయం వచ్చింది. సెప్టెంబర్ 20న సలార్ కోసం సిద్ధంగా ఉండండి’ అంటూ చిత్ర బృందం ట్వీట్ చేసింది.
అనుష్క ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ టీజర్
సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్: భయం కలిగించే చాలా సన్నివేశాలు
బట్టలు లేకుండా హట్ లుక్లో విద్యాబాలన్
హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు
శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు