తమిళ స్టార్ హీరో ధనుష్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. తెలుగు లో కూడా ధనుష్కి మంచి ఫాలోయింగ్ ఉంది. ధనుష్ ఈ ఏడాది ‘సార్’ మూవీతో తెలుగులో స్ట్రెయిట్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. వెంకీ అట్లూరి డైరెక్షన్లో వస్తున్ ఈ మూవీని సితార ఎంటర్ టైన్ మెంట్స్ ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ లపై సూర్యదేవర నాగవంశీ సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.
అరుణ్ మాధేశ్వరన్ దర్శకత్వంలో ట్రూ ఈవెంట్స్ నేపథ్యంలో 1960 పీరియడ్ లో జరిగిన కొన్ని సంఘటనలని తీసుకుని ధనుష్ హీరోగా ‘కెప్టెన్ మిల్లర్’ అనే సినిమా తెరకెక్కుతోంది. ధనుష్ కెరీర్ లోనే మాసీవ్ బడ్జెట్ తో సత్యజ్యోతి ఫిలింస్ ఈ మూవీని నిర్మిస్తోంది. జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని వచ్చే ఏడాది సమ్మర్ లో భారీ స్థాయిలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన కీలక అప్డేట్ ని విడుదల చేసింది చిత్ర బృందం. ఈ మూవీలో టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు ప్రకటిస్తూ… వెల్కమ్ అంటూ ఓ పోస్టర్ ని కూడా విడుదల చేసింది.