HomeTelugu Trendingప్రముఖ దర్శకుడు విసు కన్నుమూత

ప్రముఖ దర్శకుడు విసు కన్నుమూత

4 22
తమిళ ప్రముఖ దర్శకుడు విసు ఇక లేరు. గత కొంతకాలంగా ఆయన మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నారు. చెన్నై దురైపాక్కంలోని ఆయన స్వగృహంలో ఆదివారం సాయంత్రం కన్నుమూశారు. విసు మరణం పట్ల తమిళ చిత్రపరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది.

తమిళ దర్శకుడు కె. బాలచందర్ వద్ద దర్శకత్వ శాఖలో విసు సహాయకుడిగా పనిచేశారు. ఆ తరువాత దర్శకుడిగా మారి పలు విజయవంతమైన చిత్రాల్లో నటించారు. ఆ తరువాత ముత్తురామన్ దర్శకత్వం వహించిన కుటుంబం ఒరు కుటుంబం చిత్రంతో విసు నటుడిగా మారారు. ‘ఆడదే ఆధారం’ అనే చిత్రానికి దర్శకత్వం వహించారాయన. ఎస్పీ ముత్తరామన్‌ దర్వకత్వం వహించిన ‘కుడుంబం ఒరు కడంబం’ అనే సినిమాతో నటుడిగానూ మారారు. ఆయన దర్శకత్వం వహించిన తమిళ చిత్రం ‘సంసారం అదు నిన్‌సారం’కి జాతీయ ఉత్తమ చిత్రం అవార్డు వచ్చింది. అరుణాచలం సినిమాలో అయన అద్భుతంగా నటించి మెప్పించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu