Homeపొలిటికల్పావులు కావొచ్చు, పాపులు కావొచ్చు. తప్పు తప్పే, ద్రోహం ద్రోహమే

పావులు కావొచ్చు, పాపులు కావొచ్చు. తప్పు తప్పే, ద్రోహం ద్రోహమే

JAGAN 4

ఆంధ్రాలో ఉన్న‌తాధికారులు ఇప్పుడు నలిగిపోతున్నారు. జగన్ రెడ్డి రాజ్యంలో ఉన్న‌తాధికారులలో కొందరు నరకం అనుభవిస్తున్నారు. జగన్ రెడ్డి మాటను కాదనలేని పరిస్థితి. చేసేదేం లేక ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు ఉన్న‌తాధికారులు అప్పుడు చెలరేగిపోయారు. కానీ ఇప్పుడు ఆంధ్రాలో రాజకీయాలు మారేలా కనిపిస్తున్నాయి. దాంతో చంద్ర‌బాబుని సీక్రెట్ గా క‌లుసుకోవడానికి ఉన్న‌తాధికారులు తెగ ఉబలాట పడుతున్నారు. మొత్తానికి ఏపీలో పొలిటిక‌ల్ ట్రెండ్ ఒక్క‌సారిగా మారిపోయింది. దీనికి ప్రధాన కారణం ఒక్కటే. చంద్ర‌బాబు రాష్ట్ర‌వ్యాప్త ప‌ర్య‌ట‌న‌లు స‌క్సెస్ కావ‌డమే. దాంతో రాజ‌కీయ వాతావ‌ర‌ణంపై అన్ని వ‌ర్గాల‌కు స్ప‌ష్ట‌త వ‌చ్చేస్తోంది. మ‌రోవైపు బాబు-ప‌వ‌న్ భేటీతో మ‌రింత క్లారిటీ అంద‌రికీ వ‌చ్చేసింది.

టీడీపీ ప్ర‌భుత్వం రావ‌డం ఖాయ‌మ‌ని నిర్ధారించుకున్న గోడ‌మీద పిల్లుల్లాంటి నేత‌లు చంద్రబాబుని క‌లిసి తాము ఎందుకు దూరంగా ఉంటున్నామో వివ‌ర‌ణ ఇస్తున్నారు. తాము ఇక‌పై యాక్టివ్ గా ఉంటామ‌ని న‌మ్మ‌బ‌లుకుతున్నారు. ప‌ద‌వుల కోస‌మో, కేసుల భ‌యంతోనో, తాత్కాలిక ప్ర‌యోజ‌నాల కోస‌మో పార్టీ మారిన వారు సైతం తెలుగుదేశంలోకి మ‌ళ్లీ వ‌స్తామంటూ సంకేతాలు పంపుతున్నారు. సామాన్య‌ప్ర‌జ‌లు, నేత‌ల‌కే వైసీపీ పోవ‌డం, టీడీపీ రావ‌డం ఖాయ‌మ‌ని తేలిపోతే.. ప్ర‌భుత్వంలో ఉన్న అధికారులు ఈ విష‌యాన్ని ఎందుకు పసిగట్టరు. చాలామంది ఐఏఎస్, ఐపీఎస్‌లు హైద‌రాబాద్లో చంద్ర‌బాబుని ర‌హ‌స్యంగా క‌లుస్తున్నారని తెలుస్తోంది.

ప్ర‌భుత్వంలో కీల‌క పెద్ద‌ల ఆదేశాల‌తో తాము అడ్డ‌గోలు నిర్ణ‌యాలు తీసుకోక త‌ప్ప‌డంలేద‌ని వారంతా వాపోతున్నారు. వారికి చంద్ర‌బాబుతో గ‌త ప్ర‌భుత్వంలో అనుబంధం, బంధుత్వాలు, స్నేహాల‌ను గుర్తుచేస్తూ… మీరు ప్ర‌భుత్వంలోకి వ‌చ్చాక తమ త‌ప్పుల్ని మ‌న్నించేయాల‌ని ముందుగానే వేడుకుంటున్నారు. ముఖ్యంగా పోలీసు శాఖ‌లో చాలా ఘోరంగా వ్య‌వ‌హ‌రించిన ఓ ఐపీఎస్ అధికారి గతంలో బెట్టింగ్ మాఫియా కేసుల్లో అడ్డంగా దొరికిపోయాడు. అప్పుడు అతన్ని చంద్ర‌బాబే కాపాడార‌ని టాక్ ఉంది. ఐతే వైసీపీ స‌ర్కారు అధికారంలోకి రాగానే టీడీపీ పై జులుం చెలాయిస్తూ ఆ అధికారి చెల‌రేగిపోయాడు. క‌ట్ చేస్తే చంద్ర‌బాబుని ర‌హ‌స్యంగా విడ‌త‌ల వారీగా క‌లుస్తున్న అధికారుల్లో ఈ ఐపీఎస్ ఉన్నాడు. కానీ, బాబు మళ్ళీ ఇలాంటి వ్యక్తులను క్షమిస్తే.. టీడీపీ కార్యకర్తలు సహించరు. కాబట్టి.. రేపు టీడీపీ అధికారంలోకి వచ్చాక, ఆ ఐపీఎస్ బెట్టింగ్ రాజా నడ్డిని విరవాలి. అప్పుడే ఇలాంటి వ్యక్తులకు బుద్ది వస్తోంది.

ఇక మ‌రోవైపు సీఐడీలో ప‌నిచేస్తున్న వారంతా చంద్ర‌బాబుని ఎలాగైనా క‌లిసి త‌మ త‌ప్పేమీ లేద‌ని, అంతా తమ ఉన్న‌తాధికారి ఆడించే ఆట‌లో పావులం అంటూ చెప్పుకుంటామ‌ని రిఫ‌రెన్సులు వెతుక్కుంటున్నారు. పావులు కావొచ్చు, సూత్రధారులు కావొచ్చు. తప్పు తప్పే, ద్రోహం ద్రోహమే. టీడీపీకి, టీడీపీ కార్యకర్తలను బాధ పెట్టిన ప్రతి ఒక్కరూ తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందే. తన కార్యకర్తల జోలికి వస్తే టీడీపీ పార్టీ ఊరుకోదు అని ప్రత్యర్థులు బలంగా నమ్మాలి. భయ పడాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!