టాలీవుడ్ ప్రముఖ హాస్యనటుడు, హీరో సునీల్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో గురువారం ఉదయం చికిత్స నిమిత్తం ఆయన గచ్చిబౌలిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. గొంతు ఇన్ఫెక్షన్, వరుస షూటింగ్స్తో బిజీగా ఉండడం వల్ల సునీల్ కొంచెం నీరసించారని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. ఇటీవల అల్లు అర్జున్- త్రివిక్రమ్ కాంబినేషన్లో విడుదలైన ‘అల..వైకుంఠపురములో..’ చిత్రంలో సునీల్ కీలకపాత్రను పోషించారు. నటనతో మరోసారి ప్రేక్షకులను మెప్పించారు. ప్రస్తుతం ఆయన ‘కలర్ఫొటో’ అనే సినిమాలో విలన్గా నటిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది.