హీరో హీరోయిన్స్ సినిమా పూర్తి అయిన తరువాత ప్రెజర్ నుండి బయటకు రావడానికి వారు కొంతకాలం గ్యాప్ తీసుకుని హాలిడేస్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక ముఖ్యంగా చాలామంది ఇటీవల కాలంలో మాల్దీవ్స్ వెళుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఇద్దరు స్టార్ సెలబ్రిటీలు కూడా అక్కడికి వెళ్లారు. ముందుగా ఎవరు వెళ్లారో తెలియదు కానీ ప్రస్తుతం అయితే సోషల్ మీడియాలో విజయ్ దేవరకొండ రష్మిక మందన్నలకు సంబంధించిన ఫోటోలు అయితే వైరల్ గా మారుతున్నాయి. ఎయిర్ పోర్ట్ లో ఒకే రోజు కనిపించడం వైరల్ గా మారింది.
గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాలలో కలిసి నటించిన ఈ జంటకు మంచి క్రేజ్ ఉంది. దీంతో ఈ ఇద్దరి మధ్యలో చాలా రకాల రూమర్లు అయితే వచ్చాయి. కానీ అందులో ఎలాంటి నిజం లేదు అని ఆ తర్వాత వీళ్ళు వార్తలను కొట్టి పారేశారు. ఇక తాజా గా రష్మిక మందన గుడ్ బై సినిమా ప్రమోషన్లు పాల్గొన్న తర్వాత మళ్లీ వెంటనే మాల్దీవ్స్ కు వెళ్ళింది. ఆమెకు సంబంధించిన ఫోటో ఒకటి కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. విజయ్ తాజాగా ‘ఖుషి’ సినిమాకు సంబంధించిన ఒక షెడ్యూల్ కూడా పూర్తయింది. ఇక మరొక షెడ్యూల్ మొదలవడానికి కొంత సమయం ఉంది కాబట్టే విజయ్ దేవరకొండ ఈ గ్యాప్ లో గ్యాప్ తీసుకొని మాల్దీవ్స్ కు వెళ్ళాడు
#vijaydevarakonda spotted at Mumbai airport 🕵️🔥✈️ @viralbhayani77 pic.twitter.com/pDHbr6kfCp
— Viral Bhayani (@viralbhayani77) October 7, 2022