HomeTelugu Newsజగన్‌ కాన్వాయ్‌కు అడ్డుపడిన మహిళ.. వాహనం ఆపి ఆమెతో మాట్లాడిన జగన్‌

జగన్‌ కాన్వాయ్‌కు అడ్డుపడిన మహిళ.. వాహనం ఆపి ఆమెతో మాట్లాడిన జగన్‌

4 25వైసీపీ అధ్యక్షుడు జగన్‌ ఈరోజు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం తిరుమలలోని పద్మావతి అతిథిగృహంలో అల్పాహారం తీసుకున్న తర్వాత రేణిగుంట విమానాశ్రయానికి బయల్దేరారు. ఆసమయంలో పద్మావతి అతిథిగృహం వద్ద కాబోయే సీఎం జగన్‌ కాన్వాయ్‌కు ఓ మహిళ అడ్డుపడింది. తన భర్తకు ఉద్యోగం కావాలంటూ తూర్పుగోదావరి జిల్లా అమలాపురానికి చెందిన మహిళ కాన్వాయ్‌కు అడ్డుగా వెళ్లటంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే ఆమెను పక్కకు లాగారు. ఆ పెనుగులాటలో మహిళ చేతికి స్వల్పగాయమైంది. ఇది గమనించిన జగన్‌ వాహనం ఆపి మహిళతో మాట్లాడారు. అనంతరం ఆయన రేణిగుంట విమానాశ్రయానికి బయలుదేరారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu