HomeTelugu Newsవైసీపీ మేనిఫెస్టో

వైసీపీ మేనిఫెస్టో

4aఆంధ్రప్రదేశ్‌ ఎన్నికలకు సంబంధించి వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించింది. ఆ పార్టీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అమరావతిలోని ఆ పార్టీ కార్యాలయంలో శనివారం మేనిఫెస్టోను విడుదల చేశారు. అంతకుముందు పంచాంగ శ్రవణం కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో ఓ కొత్త అధ్యాయాన్ని మొదలుపెడుతున్నామని, మేనిఫెస్టోలోని అన్ని అంశాలను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. వైసీపీ మేనిఫెస్టోను ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంచుతామని, దీన్ని చూపించి 2024లో మళ్లీ ఓట్లు అడుగుతానని వెల్లడించారు. మేనిఫెస్టోలో మెజారిటీ అంశాలు నవరత్నాలే అని వివరించారు.

రైతులకు..
– రైతుకు పెట్టుబడి కింద రూ.50 వేలు
– పంటవేసే సమయానికి పెట్టుబడి కోసం మే నెలలో రూ.12,500
– పంట బీమా ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తుంది. రైతన్నలకు వడ్డీ లేని పంటరుణాలు, ఉచిత విద్యుత్‌, బోర్లు వేయిస్తాం.
– ఆక్వా రైతులకు కరెంటు ఛార్జీలు రూ.1.5లకే(యూనిట్‌) ఇస్తాం. వ్యవసాయానికి పగటిపూటే 9 గంటల కరెంటు
– రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు
– పంటవేసే ముందే ధరలు ప్రకటిస్తాం. గిట్టుబాటు ధరలకు భరోసా
– రూ.4 వేల కోట్లతో ప్రకృతి విపత్తుల సహాయ నిధి.
– ప్రతి నియోజకవర్గంలో గోదాంలు, శీతలీకరణ గిడ్డంగులు, ఆహార శుద్ధి కేంద్రాల ఏర్పాటు
– మొదటి ఏడాది సహకార సంఘాన్ని పునరుద్ధరిస్తాం. రెండో ఏడాది నుంచి సహకార డెయిరీకి పాలుపోసే రైతుకు లీటరుకు రూ.4 బోనస్‌
– వ్యవసాయ ట్రాక్టర్లకు రోడ్‌ ట్యాక్స్‌ రద్దు. టోల్‌ ట్యాక్స్‌ రద్దు
– వైఎస్‌ఆర్‌ బీమా ద్వారా రైతులకు రూ.7 లక్షల బీమా. ఆ డబ్బు అప్పుల వాళ్లకు చెందకుండా చట్టం
– భూ యజమానులకు ఇబ్బంది లేకుండా కౌలు రైతులకు పంటపై హక్కు ఉండేలా రైతుల భూములకు రక్షణ కల్పించేలా చట్ట సవరణ
– కౌలు రైతులకు వడ్డీ లేని రుణాలు. అన్ని ప్రయోజనాలు వారికి అందే వెసులుబాటు. నవరత్నాల్లోని అన్ని ప్రయోజనాలు వర్తింపు.

అందరికీ వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ
– రూ.5 లక్షలు ఆదాయం దాటని అన్ని వర్గాల వారికి వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ వర్తింపు
– వైద్య ఖర్చు రూ.వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ కింద వైద్యం
– ఎన్ని లక్షలు ఖర్చయినా పూర్తిగా ఆరోగ్యశ్రీ.. ఏ నగరంలో చేయించుకున్నా వర్తింపు
– చికిత్స తర్వాత విశ్రాంతి సమయంలో కుటుంబానికి చేయూత
– దీర్ఘ కాలిక వ్యాధులతో బాధపడేవారికి రూ.10 వేల పింఛను
– రెండేళ్లలో కార్పొరేటు ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వ ఆస్పత్రులు. ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యుల సంఖ్య పెంపు
– అమ్మ ఒడి కార్యక్రమంలో భాగంగా పిల్లలను బడికి పంపితే రూ.15 వేలు
– ప్రస్తుత కార్పొరేషన్‌ వ్యవస్థ ప్రక్షాళన. పారదర్శక ప్రమాణాలు తీసుకొస్తాం.
– 45 ఏళ్ల వయసు గల ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనారిటీ మహిళలకు మొదటి ఏడాది తర్వాత ఆయా కార్పొరేషన్ల ద్వారా రూ.75 వేల ఆర్థిక సాయం

4 5

పింఛను రూ.3వేలు.. ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్‌

– పింఛను రూ.3 వేలకు పెంపు. వికలాంగులకు రూ.3 వేలు పింఛను.
– పేదవారికి చదువుకయ్యే ఖర్చు పూర్తిగా ప్రభుత్వానిదే. ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో పాటు వసతి, భోజనం ఖర్చులు కూడా ప్రభుత్వ బాధ్యత
– కుల, మతం తేడా లేకుండా అర్హులైన అందరికీ పక్కా ఇళ్లు
– వైఎస్‌ఆర్‌ జలయజ్ఞం
– పోలవరం, వెలిగొండ సహా అన్ని ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి
– ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయం ద్వారా అదే గ్రామానికి చెందిన చదువుకున్న యువతకు పది ఉద్యోగాలు
– ఫీజు రీయింబర్స్‌మెంట్‌, పింఛను వంటి సమస్యలు 72 గంటల్లోనే పరిష్కారం
– ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్‌ విడుదల
– ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చేలా అసెంబ్లీ మొదటి సమావేశంలోనే బిల్లు
– యువతకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ
– ప్రభుత్వ కాంట్రాక్టులన్నీ నిరుద్యోగ యువతకు వచ్చేలా చూస్తాం.
– ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ యువతకు 50 శాతం రిజర్వేషన్‌

మద్యపాన నిషేధం..అగ్రిగోల్డ్‌ బాధితులకు మేలు
– సున్నా వడ్డీకే రుణాల పథకాన్ని మళ్లీ తెస్తాం. పొదుపు సంఘాల వడ్డీ డబ్బు బ్యాంకులకు ప్రభుత్వమే కడుతుంది.
– మద్యాన్ని నిషేధిస్తాం. మద్యాన్ని 5 నక్షత్రాల హోటళ్లకు మాత్రమే పరిమితం చేస్తాం.
– అగ్రిగోల్డ్‌ బాధితులకు రూ.1150 కోట్లు కేటాయింపు. 13 లక్షల బాధితులకు మేలు చేస్తాం. మిగిలిన వారికి తక్షణం పరిష్కారం దిశగా అడుగులు వేస్తాం.
– తిరుమలలో యాదవులు గుడి తలుపులు తెరిచే సంప్రదాయం పునరుద్ధరణ
– చనిపోయిన ప్రతి గొర్రెకు రూ.6 వేల బీమా
– సొంత ట్యాక్సీ నడిపేవారికి ఏడాదికి రూ.10 వేలు
– 18 ఏళ్లు నిండి 60 ఏళ్లలోపు వయసు ఉన్న ఏ పౌరుడికైనా వైఎస్‌ఆర్‌ జీవన బీమా పథకం కింద సహజ మరణమైనా లక్ష రూపాయలు అందజేత
– మాదిగ, రెల్లి, మాలలకు కార్పొరేషన్‌ ఏర్పాటు
– ఎస్సీ, ఎస్టీల యువతుల పెళ్లికి రూ.లక్ష
– గిరిజనులకు ప్రత్యేక జిల్లా ఏర్పాటు. అందులో విశ్వవిద్యాలయం, ఆస్పత్రి, కళాశాల ఏర్పాటు. ప్రతి ఐటీడీఏ పరిధిలో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి
– ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గం వారు ప్రమాదవశాత్తూ మరణిస్తే రూ.5 లక్షలు
– ప్రభుత్వ పాఠశాలలో చదువుల ప్రమాణాలు మార్చుతాం. ఆంగ్ల మాద్యమంలో విద్యా బోధన. మాతృభాషకు సముచిత స్థానం
– ప్రైవేటు విద్యా సంస్థల్లో ఫీజు తగ్గింపు. ప్రైవేటు ఉపాధ్యాయుల స్థితిగతుల మెరుగుకు రెగ్యులేటరీ కమిటీ
– జర్నలిస్టులకు ఆయా ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు

బీసీలకు..
– బీసీల అభ్యున్నతికి ఏటా రూ.15 వేల కోట్ల ఖర్చు. ఐదేళ్లలో రూ.75 వేల కోట్లు ఖర్చు
– అన్ని నామినేటెడ్‌ పదవుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 50 శాతం రిజర్వేషన్లు. వారి ఆర్థిక ఎదుగుదలకు అన్ని కాంట్రాక్టుల్లో 50 శాతం రిజర్వేషన్‌ చేస్తూ చట్టం
– బీసీలోని ఉపకులాల్లో వారికి కార్పొరేషన్లు ఏర్పాటు
– బీసీ యువతులకు పెళ్లి కానుక రూ.55 వేలకు పెంపు
– బీసీ జనగణన చేసి చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్‌ చేయాలని కేంద్రానికి సిఫార్సు
– శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్‌ ఏర్పాటు చేసి దానికి చట్టబద్ధత
– బీసీ కులాల వారు ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.5 లక్షలు
– దుకాణాలున్న దర్జీలు, నాయీ బ్రాహ్మణులు, రజకులకు ఏడాదికి రూ.10 వేల ఆర్థిక సాయం
– వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు ఏప్రిల్‌ 15 నుంచి జూన్‌ 14 వరకూ రూ.10 వేలకు ఆర్థిక సాయం పెంపు-* పడవలకు కొత్తగా అనుమతులు మంజూరు. -చప్రమాదవశాత్తు చనిపోయిన కుటుంబాలకు రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియా

– ప్రతి చేనేత కుటుంబానికి ఏడాదికి రూ.20 వేల ప్రోత్సాహకం
– కులవృత్తులు, చిరువ్యాపారులకు గుర్తింపు కార్డులు. వీరికి రూ.10 వేల వరకు సున్నా వడ్డీకే రుణాలు

– బీసీ హక్కులకు భంగం, నష్టం కలగకుండా ఉండే రిజర్వేషన్లకే వైకాపా మద్దతు
– కాపు కార్పొరేషన్‌కు ఏడాదికి రూ.2 వేల చొప్పున పదేళ్లలో రూ.10 వేల కోట్ల కేటాయింపు
– జూనియర్‌ న్యాయవాదులకు మొదటి మూడేళ్ల ప్రాక్టీస్‌ పీరియడ్‌లో రూ.5 వేల భృతి. హైకోర్టులో ప్రాక్టీస్‌ చేస్తున్న వారికి ఇళ్ల స్థలాలు తక్కువ ధరకే.
– అర్చకులకు పదవీ విరమణ రద్దు. అర్చకులకు వేతనాల కోసం పంచాయతీ జనాభాను బట్టి రూ.10 నుంచి రూ.35 వేల వరకూ. ఇళ్ల స్థలాలు కేటాయించి ఇళ్ల నిర్మాణం
– మైనారిటీ సబ్‌ ప్లాన్‌ పారదర్శకంగా అమలు చేస్తాం. వక్ఫ్‌, ముస్లిం మైనారిటీలకు సంబంధించి స్థిర చరాస్తుల రీసర్వే. శాశ్వత ప్రాతిపదికన డిజిటలైజ్‌ చేసి ఆ వర్గాల అభ్యున్నతికి తోడ్పడేలా కృషి
– ముస్లిం, మైనారిటీ యువతులకు పెళ్లికి రూ.లక్ష
– హజ్‌ యాత్రకు వెళ్లే వారికి ఆర్థిక సాయం. ఇమామ్‌, మౌజమ్‌లకు వేతనంగా రూ.15వేలు. ప్రమాదవశాత్తు ముస్లిం, మైనారిటీ మరణిస్తే రూ.5 లక్షలు
– క్రిస్టియన్ల యువతి వివాహానికి రూ.లక్ష ఆర్థిక సాయం. పాస్టర్లకు వివాహ రిజిస్ర్టేషన్‌ సులభతరం. వారికి రూ.5వేలు గౌరవవేతనం

– ప్రమాదవశాత్తు క్రిస్టియన్లు మరణిస్తే రూ.5 లక్షలు
– అన్ని అగ్ర కులాల వారికి కార్పొరేషన్ల ఏర్పాటు
– కులం, మతం, వర్గానికి తావు లేకుండా సుపరిపాలన

జిల్లాల పెంపు.. సీపీఎస్‌ రద్దు

– ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని ఓ జిల్లా చేస్తాం. పరిపాలన ప్రజల వద్దకే తీసుకెళ్తాం. రాజధానిని ఫ్రీజోన్‌గా మారుస్తూ అందరికీ ఉద్యోగాలు వచ్చే ప్రాంతంగా గుర్తిస్తూ వికేంద్రీకరణ లక్ష్యంగా రాష్ట్రంలోని మూడు ప్రాంతాలను సమగ్రంగా అభివృద్ధి చేస్తాం.
– గ్రామ సచివాలయాలు, పట్టణాల్లో వార్డు సచివాలయాలు ఏర్పాటు చేసి సమగ్రాభివృద్ధికి ప్రభుత్వ పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్లేలా ఏర్పాటు
– ప్రభుత్వ ఉద్యోగులకు సీపీఎస్‌ రద్దు. పాత పింఛను విధానం అమలు. ఉద్యోగులు కోరుకున్న విధంగా 27 శాతం ఐఆర్‌. సకాలంలో పీఆర్సీ అమలు
– అన్ని ప్రభుత్వ శాఖల్లో ఉన్న కాంట్రాక్టు ఉద్యోగులను అర్హత పనిని బట్టి క్రమబద్ధీకరణ
– పోలీస్‌లకు వారాంతపు సెలవు అమలు
– అంగన్‌వాడీ, ఆశా వర్కర్లు, హోంగార్డులకు తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న జీతాల కన్నా రూ.వెయ్యి ఎక్కువగా ఇస్తాం.
– ప్రభుత్వ ఉద్యోగులకు ఆయా స్థలాల్లో ఇళ్ల స్థలాలు
– పరిశ్రమల స్థాపన కోసం ప్రోత్సాహకాలకు తోడు ఏపీఐఐసీని పునరుద్ధరించి నిరుద్యోగ యువతకు సబ్సిడీ అందించి కొత్త అధ్యాయానికి శ్రీకారం

Recent Articles English

Gallery

Recent Articles Telugu