వైసీపీలో చేరిన వారిపై టీడీపీ నేతలు బెదిరింపులకు పాల్పడుతున్నారని.. ప్రతి కార్యకర్తకు వైసీపీ అండగా ఉంటుందని మాజీ ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి అన్నారు. కడప జిల్లా మైదుకూరు పట్టణంలో టీడీపీకి చెందిన 180 కుటుంబాలు వైసీపీలో చేరాయి. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ మాట్లాడుతూ నాలుగేళ్లుగా టీడీపీ, బీజేపీ ప్రభుత్వాలు ప్రజలకు ఎలాంటి మేలు చేయలేదన్నారు. టీడీపీ ప్రభుత్వానికి కాలం చెల్లించని, ప్రజల సమస్యల పట్ల అలుపెరుగని పోరాటం చేస్తున్న జగన్మోహన్రెడ్డిని సీఎం చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.
వైఎస్సార్సీపీలో చేరిన వారిని బెదిరించటం, భయపెట్టడం లాంటివి టీడీపీ నేతలు మానుకోవాలని, బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తే ఊరుకోమన్నారు. కడప మేయర్ సురేష్బాబు మాట్లాడుతూ నాలుగేళ్ల కాలంలో ఏ ఒక్కరికైనా ఇంటి స్థలం మంజూరు చేశారా, పింఛన్ ఇచ్చారా, రోడ్డు వేశారా అని టీడీపీ నేతలను ప్రశ్నించారు.