HomeTelugu Newsతన పేరును జగన్‌మోడీ రెడ్డిగా మార్చుకోవాలి: లోకేష్

తన పేరును జగన్‌మోడీ రెడ్డిగా మార్చుకోవాలి: లోకేష్

పశ్చిమగోదావరి జిల్లా వేలివెన్ను, నిడదవోలు మండలం తాడిమళ్ల గ్రామాల్లో నిర్వహించిన సభల్లో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఏపీకి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ప్రధాని మోడీ అన్యాయం చేశారని, అయితే ప్రతిపక్షనాయకుడు జగన్ వారిని విమర్శించకుండా సీఎం చంద్రబాబుపై ఆరోపణలు చేయడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. ప్రతిపక్ష నాయకుడు జగన్ తన పేరును జగన్‌మోడీ రెడ్డిగా మార్చుకోవాలని లోకేష్ విమర్శించారు.

5 2

వైఎస్ జగన్ తన పాదయాత్రలో ఎక్కడా కేంద్రంపై ఒక్క మాట కూడా మాట్లడటం లేదని అవినీతి పుత్రుడైన జగన్ బీజేపీ నేతలను విమర్శిస్తే జైలుకెళ్తాడని లోకేష్ అన్నారు. కర్ణాటక ఎన్నికలు ట్రైలర్ మాత్రమేనని 2019 ఎన్నికల్లో బీజేపీకి తెలుగు జాతి దిమ్మతిరిగే సమాధానం ఇస్తారని లోకేష్ అన్నారు. రాష్ట్ర అభివృద్ధి చూసి మోడీకి కన్నుకుట్టిందని అందుకే ఇతర రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చి.. ఏపీకి ఇవ్వకుండా మోసం చేశారని ఆరోపించారు. కులం, మతం, ప్రాంతం పేరుతో పలువురు నాయకులు
రాష్ట్రంలో చిచ్చుపెడుతున్నారని ఆరోపించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu