HomeTelugu News''ప‌డి ప‌డి లేచె మ‌న‌సు'' అంటున్న శ‌ర్వానంద్

”ప‌డి ప‌డి లేచె మ‌న‌సు” అంటున్న శ‌ర్వానంద్

ప్రేక్షకులు మెచ్చే సినిమాలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో శర్వానంద్ చేతిలో ప్ర‌స్తుతం రెండు ప్రాజెక్టులున్నాయి. సుధీర్ వర్మ దర్శకత్వంలో ఒకటి కాగా, హను రాఘవపూడి దర్శకత్వంలో శ‌ర్వానంద్ హీరో గా తెర‌కెక్కుతున్న చిత్రం ”ప‌డి ప‌డి లేచె మ‌న‌సు”. ఈ సినిమాలో సాయి ప‌ల్ల‌వి హీరోయిన్ గా న‌టిస్తుంది. రొమాంటిక్ ఎంట‌ర్ టైన‌ర్‌గా ఈ చిత్రాన్ని ప్ర‌సాద్ చుక్క‌ప‌ల్లి- సుధాక‌ర్ చెరుకూరి సంయుక్తంగా రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో హీరో సునీల్ ఓ కీల‌క పాత్ర‌ చేయబోతున్నట్టు తెలిసింది. హీరో శ‌ర్వానంద్ కూడా డిఫ‌రెంట్ లుక్ ఫుట్ బాల్ ప్లేయర్ గా కనిపించ‌నున్నాడు.

4 2

ప్ర‌స్తుతం ఈ సినిమా హైదరాబాద్ ప‌రిస‌ర ప్రాంతాల్లో రెండో షెడ్యూల్ షూటింగ్ జ‌రుగుతోంది. ఇప్ప‌టికే కోల్‌క‌తాలో మొద‌టి షెడ్యూల్ భారీ సన్నివేశాల చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి విశాల్ చంద్ర‌శేఖ‌ర్ సంగీతం అందిస్తున్నారు. దీనికి సంబంధించిన కొన్ని పోస్ట‌ర్లు ఆక‌ట్టుకునేలా ఉన్నాయి. ప్ర‌తి ఒక్క‌రు ఈ చిత్రాన్నిఇష్ట‌ప‌డ‌తార‌ని నితిన్ ట్వీట్ చేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!