HomeTelugu Newsవైసీపీలోకి మాజీ సీఎం కుమారుడు

వైసీపీలోకి మాజీ సీఎం కుమారుడు

11 5

దివంగత మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి కుమారుడు నేదురుమల్లి రామ్‌కుమార్‌ రెడ్డి త్వరలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరబోతున్నట్టు ప్రకటించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాను త్వరలోనే పైసీపీలో చేరనున్నట్టు తెలిపారు. వైఎస్సార్‌ కుటుంబానికి తమ కుటుంబానికి మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. నేదురుమల్లి అభిమానులందరు తనతో కలిసి రావాలని కోరారు. త్వరలోనే కార్యకర్తలు అభిమానులతో కలిసి వైఎస్సార్‌ సీపీలో చేరుతానని వెల్లడించారు. పార్టీ మారే అంశంపై చర్చించడానికి జిల్లాలోని నేదురుమల్లి అభిమానులు, కార్యకర్తలతో రామ్‌కుమార్‌రెడ్డి బుధవారం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పాల్గొన్న అభిమానులు వైసీపీలో చేరాలని సూచించినట్టు తెలిసింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!