పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందిన చిత్ర ‘ఆదిపురుష్’. రామాయణంలోని కొన్ని ప్రధాన ఘట్టాల ఆధారంగా భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైంది. కానీ, బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమైంది.
ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపించగా కృతీ సనన్ జానకిగా నటించింది. కానీ ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. అంతేకాక దర్శకుడు విభిన్నంగా ఈ సినిమాని చూపించాలి అనే క్రమంలో.. చేసిన కొన్ని తప్పుల కారణంగా..ఈ చిత్రం పలు వివాదాలకూ కేంద్ర బిందువుగా మారింది. బ్రేక్ ఈవెన్ కూడా సాధించకముందే థియేటర్ల నుంచి తెరమరుగైంది.
తాజాగా ఈ చిత్రం సైలెంట్ ఓటీటీలోకి వచ్చింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’ లో నిన్న అర్ధరాత్రి నుంచి ‘ఆదిపురుష్’ స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం అద్దె ప్రాతిపదికన ఇది అందుబాటులో ఉంది. ప్రైమ్ ఖాతాదారులు అదనంగా రూ.279 కడితేనే ఈ సినిమాను చూడొచ్చు. దక్షిణాది భాషల్లో సినిమా అమెజాన్ లో స్ట్రీమ్ అవుతోంది. ఆదిపురుష్ హిందీ ఓటీటీ హక్కులు నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది.