HomeTelugu Trendingసైలెంట్‌ ఓటీటీలోకి వచ్చేసిన 'ఆదిపురుష్‌'

సైలెంట్‌ ఓటీటీలోకి వచ్చేసిన ‘ఆదిపురుష్‌’

adipurush streaming on amaz

పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందిన చిత్ర ‘ఆదిపురుష్’. రామాయణంలోని కొన్ని ప్రధాన ఘట్టాల ఆధారంగా భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైంది. కానీ, బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమైంది.

ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపించగా కృతీ సనన్‌ జానకిగా నటించింది. కానీ ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. అంతేకాక దర్శకుడు విభిన్నంగా ఈ సినిమాని చూపించాలి అనే క్రమంలో.. చేసిన కొన్ని తప్పుల కారణంగా..ఈ చిత్రం పలు వివాదాలకూ కేంద్ర బిందువుగా మారింది. బ్రేక్ ఈవెన్ కూడా సాధించకముందే థియేటర్ల నుంచి తెరమరుగైంది.

తాజాగా ఈ చిత్రం సైలెంట్‌ ఓటీటీలోకి వచ్చింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’ లో నిన్న అర్ధరాత్రి నుంచి ‘ఆదిపురుష్’ స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం అద్దె ప్రాతిపదికన ఇది అందుబాటులో ఉంది. ప్రైమ్ ఖాతాదారులు అదనంగా రూ.279 కడితేనే ఈ సినిమాను చూడొచ్చు. దక్షిణాది భాషల్లో సినిమా అమెజాన్ లో స్ట్రీమ్ అవుతోంది. ఆదిపురుష్ హిందీ ఓటీటీ హక్కులు నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu