ఎలాన్ మస్క్ ను ఆహ్వానించిన జగన్.. ఇదీ కామెడీ కాదు, సీరియస్ అండి బాబు. మన జగన్ గోరు విశాఖపట్నంలో జరగబోతున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కి ఎలాన్ మస్క్ కు ఆహ్వాన పత్రిక పంపించారు. ఇంకేం ఉంది ?, జగన్ గోరి అహ్వాన పత్రిక చూసేసి.. ఆ టెస్లా అధినేత మన ఎలన్ మస్క్ బాబు ఉన్నపల్లంగా ఏపిలో వాలబోతున్నాడట. ఇదండీ.. మన జగన్ మీడియా పరిస్థితి. ఏపిలో ఉన్న కంపెనీలను తరిమేసేసి.. పైగా వచ్చే కొత్త కంపెనీలు రాకుండా బల్ల కింద చేతులు పెట్టీ.. ఎలాన్ మస్క్ ను ఆహ్వానించాం అని చెబుతున్నారు.
మస్క్ ఏమైనా విజయసాయి రెడ్డినా ?, జగన్ పిలవగానే పరిగెత్తుకుంటూ రావడానికి. ఎలన్ మస్క్ ఇంటర్ నేషనల్ ఫిగర్. మరీ ఈ విషయం మన జగన్ గారికి తెలుసో లేదో. దయచేసి ఎవరైనా కూర్చోపెట్టీ చెప్పండ్రా నాయనా. ఈ ప్రపంచంలో ఈ జగన్ రెడ్డి అనే వ్యక్తి ఒకడు ఉన్నాడు అని కూడా ఎలన్ మస్క్ కి తెలిసి ఉండక పోవచ్చు. మరీ ఉన్నట్టు ఉండి జగన్ మీడియా ఈ ఎలన్ మస్క్ ను ఎందుకు సీన్ లోకి తీసుకు వచ్చింది. కారణం ఒక్కటే. ఎలన్ మస్క్ ఇప్పుడు వార్తల్లో వ్యక్తి, ట్విట్టర్ ని కొన్న తర్వాత ప్రతిరోజూ ఆయన ప్రపంచవ్యాప్తంగా టాక్ ఆఫ్ ది సోషల్ మీడియాగా నిలుస్తున్నారు.
అలాంటి మస్క్ ఏపీకి రాబోతున్నాడు అంటే.. జగన్ కి మైలేజ్ వస్తోంది కదా. వస్తోందో రాదో జగన్ కి ఎలాగూ తెలియదు. ఆ స్థాయిలో జగన్ ఆలోచనలు ఉంటున్నాయి ఈ మధ్య. ఎప్పుడైతే ఏపీ సీఎంగా జగన్ బాధ్యతలు చేపట్టాడో.. అప్పటి నుంచి ఆయన తీరే కాదు, ఆయనలోని కామెన్ సెన్స్ కూడా సెన్స్ లేకుండా అయిపోయింది. అసలు విశాఖపట్నంలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ పెట్టడమే కామెడీ. హైదరాబద్ లాంటి మహా నగరంలో పెడుతుంటేనే.. పెద్ద ఇన్వెస్టర్స్ ఎవ్వరూ పెద్దగా పట్టించుకోవడం లేదు. మరీ విశాఖపట్నంలో పెడితే ఇక ఎవరు వస్తారు ?, పైగా అది కూడా జగన్ పెడితే!! సరిపోయింది.
దీనికి తోడు బిల్డప్ కోసం ఎలాన్ మస్క్ సహా మరికొంతమంది ప్రముఖులకు సీఎం జగన్ ఆహ్వాన పత్రికలు పంపించారు. 2 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమానికి 15మంది కేంద్ర మంత్రులు, మరో 15 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, 44 మంది ప్రపంచ ప్రఖ్యాత పారిశ్రామిక వేత్తలు, 53 మంది భారతీయ వ్యాపారవేత్తలు, వివిధ దేశాల రాయబారులు రాబోతున్నారు అంటూ జగన్ మీడియా ఎక్కడా లేని హడావుడి చేస్తోంది. పెట్టుబడులు ఏపికి దూరం అవుతున్నాయి అని ప్రజలు కూడా చింతుస్తున్నారు. ఈ చింత కనిపెట్టే.. జగన్ ఈ ఐడియా ఆలోచించాడు. కానీ ఇది కామెడీ పాలు కాక తప్పేలా లేదు లేండి.