ఈ సందర్భంగా మీడియా సమావేశం నిర్వహించిన ఈసీ రమేశ్ కుమార్ స్థానిక ఎన్నికల్లో జరిగిన పలు హింసాత్మక ఘటనలపై స్పందించారు. ఎన్నికల నామినేషన్ల పర్వంలో కొనసాగిన దౌర్జన్యాలు, దాడులను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలిపారు. కొన్నిచోట్ల అభ్యర్థులను బెదిరింపులకు గురిచేయడం దారుణమని అన్నారు. అల్లర్లను అదుపు చేయలేకపోయిన పోలీసులు, అధికారులపై చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. గుంటూరు, చిత్తూరు కలెక్టర్లు, ఎస్పీలను విధులనుంచి తప్పించి ప్రత్యామ్నాయ
అధికారులను నియమించాలని ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. గుంటూరు జిల్లా మాచర్లలో టీడీపీ నాయకులపై జరిగిన దాడి ఘటనలో నిందితులకు స్టేషన్ బెయిల్ ఇచ్చిన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని ఆదేశించింది.