దక్షిణాదితోపాటు బాలీవుడ్లోనూ విజయవంతంగా రాణిస్తున్న హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. హిందీలో ఆమె కొత్త ప్రాజెక్టు ఖరారైంది. వైవిధ్యమైన కథలతో అలరిస్తున్న బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్తో కలిసి ఆమె నటించబోతున్నారు. ఈ ప్రాజెక్టును బుధవారం అధికారికంగా ప్రకటించారు. కాశ్వీ నాయర్ దర్శకత్వం వహించబోతున్నారు. భూషణ్ కుమార్, మోనీషా అడ్వాణీ, మధు భోజ్వాణీ, నిఖిల్ అడ్వాణీ, జాన్ అబ్రహం నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ నెలలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్లు చిత్ర బృందం పేర్కొంది. ఇంకా ఈ సినిమా టైటిల్ను ఖరారు చేయలేదు. ‘ఇది కొత్త ప్రయాణం. ప్రతి భారతీయుడు ఈ సినిమాకు కనెక్ట్ అవుతాడు’ అని ఈ సందర్భంగా రకుల్ ట్వీట్ చేశారు.
రకుల్ ప్రస్తుతం ‘భారతీయడు 2’ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్నారు. కమల్ హాసన్ హీరో. మరోపక్క ఆమె ఓ తమిళ చిత్రంలోనూ నటిస్తున్నారు. ఆమె హిందీలో నటించిన ‘మార్జావాన్’ ఈ నెల 8న విడుదల కాబోతోంది. అర్జున్ కపూర్ తను నటించిన ‘పానిపత్’ సినిమా ప్రచారంలో బిజీగా ఉన్నారు.