కరోనా వైరస్ రోజు రోజుకు విజృంభిస్తుంది. భారతదేశంలో కూడా ఈ వైరస్ వేగంగా విస్తరిస్తోంది. దీంతో ఇండియాలో లాక్ డౌన్ విధించారు. ఎవరూ కూడా బయటకు రావడం లేదు. విదేశాల నుంచి వచ్చిన వ్యక్తులపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. తమిళనాడులో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్న తరుణంలో కోలీవుడ్ హీరోలపై తమిళనాడు అధికారులు దృష్టి సారించారు. మార్చి 10 వ తేదీ తరువాత విదేశాల నుంచి వచ్చిన స్టార్స్ ఎవరున్నారు అనే దానిపై ఇప్పటికే డేటా సేకరించింది పనిలో ఉండి అక్కడి ప్రభుత్వం. తాజాగా తమిళనాడు స్టార్ హీరో విజయ్ కు అధికారులు కరోనా పరీక్షలు నిర్వహించినట్టు తెలుస్తోంది. విజయ్, అయన కుటుంబసభ్యులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. అయితే, వీరికి నెగెటివ్ వచ్చినట్టు తమిళనాడు ఆరోగ్యశాఖ ప్రకటించింది.