HomeTelugu Big Storiesచిరు కోసం బాహుబలి టీం!

చిరు కోసం బాహుబలి టీం!

మెగాస్టార్ చిరంజీవి ‘ఖైదీ నెంబర్ 150’ సినిమాతో తన జోరుని మళ్ళీ ప్రేక్షకులను రుచి చూపించాడు. ఇకపై అదే జోరుని కంటిన్యూ చేయబోతున్నాడు. ఈ నేపధ్యంలో పరుచూరి బ్రదర్స్ రచించిన ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ కథతో సెట్స్ పైకి వెళ్లాలని ప్లాన్ చేస్తున్నాడు. ఈ చిత్రానికి రామ్ చరణ్ నిర్మాతగా, సురేందర్ రెడ్డి దర్శకుడిగా వ్యవహరించబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమాను మొదలుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

చారిత్రక నేపధ్యంలో సాగే ఈ సినిమాకు గ్రాఫిక్స్ తప్పనిసరి. విజువల్ అఫెక్ట్స్ భారీ స్థాయిలో ఉండడానికి ఈ సినిమాకు బాహుబలి టీం తో పనిచేయించాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. ఈ విషయమై కమల్ కణ్ణన్ తో చర్చలు జరుపుతున్నారు. గతంలో రూపొందిన ‘మగధీర’,’బాహుబలి’ చిత్రాలకు విజువల్ ఎఫెక్ట్స్ అందించింది ఈయనే. దీంతో చరణ్.. చిరు సినిమా కోసం కమల్ కణ్ణన్ ను రంగంలోకి దింపాలని ప్లాన్ చేస్తున్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu