‘ప్రేమమ్’ చిత్రంతో హిట్ బాట పట్టిన నాగచైతన్య లిస్ట్ లో ప్రస్తుతం చాలా సినిమాలు ఉన్నాయి.
వరుసగా ఒకదాని తరువాత ఒకటి చేసుకుంటూ.. వెళ్తున్నాడు. ప్రస్తుతం ఆయన నటించిన
‘సాహసం శ్వాసగా సాగిపో’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే ఈ సినిమా రిలీజ్
అయిన తరువాత చైతు, శ్రీనువైట్లతో సినిమా చేయనున్నాడనే మాటలు వినిపిస్తున్నాయి.
వరుస పరాయజయాలను చవిచూస్తోన్న శ్రీనువైట్ల ప్రస్తుతం వరుణ్ తేజ్ హీరోగా ‘మిస్టర్’
చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఈ సినిమాపై ఆయన ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఖచ్చితంగా
హిట్ కొడతాననే నమ్మకంతో ఉన్నాడు. అయితే ఆ సినిమా సెట్స్ మీద ఉండగానే మరో
సినిమా కోసం ప్లాన్ చేస్తున్నాడు ఈ దర్శకుడు. నాగచైతన్య కోసం కథను సిద్ధం చేసుకొని
చైతుకి, నాగార్జునకు ఆ కథను వినిపించాడట. ఇద్దరికీ కథ బాగా నచ్చడంతో గ్రీన్ సిగ్నల్
ఇచ్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం.