బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనే.. యాసిడ్ దాడి బాధితులకు మద్దతుగా ‘అబ్ లడ్నా హై’ అనే ఉద్యమాన్ని ప్రారంభించింది. ఆమె తన సహనటుడు విక్రాంత్ మాసేతో కలసి ఈ ఉద్యమ ప్రచార గీతం వీడియోను ఈ రోజు విడుదల చేసింది. మిగతావారి లాగానే సాధారణ జీవితం గడుపుతున్న యాసిడ్ దాడి బాధితులను గురించి ఈ వీడియోలో చిత్రీకరించారు. ప్రముఖ బాలీవుడ్ గీత రచయిత గుల్జార్ ఈ పాటను రచించారు. ఎటువంటి పరిస్థితులకైనా ఎదురునిలిచి పోరాడాలని ఈ వీడియో గీతం పిలుపునిస్తుంది. ఈ గీతం మనసుల్లో దాచుకోవలసిన కవితాత్మక భావన అని దీపిక ఈ సందర్భంగా చెప్పింది. ‘అబ్ లడ్నా హై’ గురించి మాట్లాడుతూ మార్పునకు పునాది ప్రారంభించటం అని దీపిక అభిప్రాయపడింది. కాగా యాసిడ్ దాడి బాధితురాలి నిజ జీవిత గాధ ఆధారంగా దీపిక నిర్మించి, నటించిన ఛపాక్ చిత్రం జనవరి 10న విడుదల కానుంది.