HomeTelugu Big Storiesప్రభాస్‌కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు

ప్రభాస్‌కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు

Delhi Highcourt Notice to P
పాన్‌ ఇండియా స్టార్‌ ప్ర‌భాస్‌కు ఢిల్లీ హైకోర్టు సోమ‌వారం నోటీసులు జారీ చేసింది. బాలీవుడ్ డైరెక్టర్‌ ఓం రౌత్ ద‌ర్శ‌కత్వంలో తెర‌కెక్కుతున్న ‘ఆదిపురుష్’ సినిమాలో ప్రభాస్‌ రాముడి పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఈ సినిమాకు చెందిన టీజ‌ర్ ఇటీవ‌లే విడుదలైంది. కాగా… ప‌లు వ‌ర్గాలు ఈ టీజ‌ర్‌పై అభ్యంత‌రం వ్యక్తం చేస్తున్నారు.

ఈ క్ర‌మంలో ‘ఆదిపురుష్’ సినిమాలో హిందువుల మ‌నోభావాల‌ను గాయ‌ప‌రిచారంటూ ఓ సంస్థ ఢిల్లీ హైకోర్టును ఆశ్ర‌యించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ‘ఆదిపురుష్’ సినిమా విడుద‌ల‌పై స్టే విధించాల‌ని కూడా స‌ద‌రు సంస్థ కోర్టును కోరింది.

ఈ పిటిష‌న్‌పై సోమ‌వారం విచార‌ణ చేప‌ట్టిన ఢిల్లీ హైకోర్టు హీరో ప్ర‌భాస్‌కు నోటీసులు జారీ చేసింది. ప్ర‌భాస్‌తో పాటు ‘ఆదిపురుష్’ చిత్ర యూనిట్‌కు కూడా కోర్టు నోటీసులు జారీ చేసింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu