HomeTelugu Trendingరికార్డ్‌ క్రియేట్‌ చేసిన 'గుంటూరు కారం' ట్రైలర్‌

రికార్డ్‌ క్రియేట్‌ చేసిన ‘గుంటూరు కారం’ ట్రైలర్‌

Guntur kaaram movie trailerటాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేశ్ బాబు – త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న తాజా చిత్రం ‘గుంటూరు కారం’. హారిక – హాసిని బ్యానర్ పై ఈ సినిమాను నిర్మించారు. సంక్రాంతి కానుకగా ఈ నెల 12వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందు రానుంది.

ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ట్రైలర్ ను విడుదల చేశారు. యూట్యూబ్‌లో దుమ్మురేపుతోంది. కేవ‌లం ప‌న్నెండు గంట‌ల్లోనే 25 మిలియ‌న్ల వ్యూస్‌ను సొంతం చేసుకున్న‌ది. యూట్యూబ్‌లో ట్రెండింగ్ లిస్ట్‌లో గుంటూరు కారం ట్రైల‌ర్ నంబ‌ర్ వ‌న్ లిస్ట్‌లో నిలిచింది.

టాలీవుడ్‌లో అతి త‌క్కువ టైమ్‌లో హ‌య్యెస్ట్ వ్యూస్ సొంతం చేసుకున్న ట్రైల‌ర్‌గా గుంటూరు కారం రికార్డ్ క్రియేట్ చేసింది. గుంటూరు కారం ట్రైల‌ర్‌కు 24 గంట‌ల్లో న‌ల‌భై మిలియ‌న్ల కుపైగా వ్యూస్ వ‌చ్చే అవ‌కాశం ఉన్న‌ట్లు స‌మాచారం.

ఇక ట్రైలర్‌లో చూస్తే మహేశ్ బాబు సింపుల్ డైలాగ్స్ ‘ఆట సూస్తావా’ అనే ఆయన మేనరిజం .. పండు మిరపకాయలు ఆరబోసిన ప్లేస్ లో జరిగే ఫైట్ హైలైట్ గా ఫ్యాన్స్‌ని ఆకట్టుకుంటున్నాయి. ఇక శ్రీలీలను చూస్తూ ఆయన చెప్పే డైలాగ్స్ హైలైట్‌.

మొత్తం మీద ఈ ట్రైలర్ సినిమాపై మరింతగా హైప్‌ని క్రియేట్‌ చేశాలా ఉంది. జగపతిబాబు, ప్రకాశ్ రాజ్, రావు రమేశ్, రమ్యకృష్ణ తదితరులు ఇతర ముఖ్యమైన పాత్రలలో కనిపిస్తున్నారు. ఈ సినిమాకి తమన్ సంగీతం అందించాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu