Homeతెలుగు Newsఅగ్రిగోల్డ్ ఆస్తులను దోచుకోవాలని చూస్తున్నారు: జీవీఎల్

అగ్రిగోల్డ్ ఆస్తులను దోచుకోవాలని చూస్తున్నారు: జీవీఎల్

ఆంధ్రప్రదేశ్‌లో సీఐడీ చంద్రన్న ప్రయోజన విభాగంగా మారిందని రాజ్యసభ సభ్యుడు, బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్‌ నరసింహారావు విమర్శించారు. అగ్రిగోల్డ్‌ ఆస్తుల విలువను ఏ ప్రాతిపదికన లెక్కించారని ఆయన ప్రశ్నించారు. 2014లో అగ్రిగోల్డ్‌ ఆస్తుల విలువ రూ. 25 వేల కోట్ల రూపాయలుంటే ఇప్పుడు తక్కువ మొత్తానికి ఎలా పడిపోయిందో వెల్లడించాలని అన్నారు. ప్రభుత్వంలోని మంత్రులు, ఎమ్మెల్యేలపై సీఐడీ విచారణ వేసిన ఏ కేసులోనూ పురోగతి లేదని జీవీఎల్‌ దుయ్యబట్టారు. టీడీపీ నేతలు అగ్రిగోల్డ్ ఆస్తులను అక్రమంగా దోచుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఛైర్మన్‌కు సైతం ఆస్తుల వేలం విషయంలో లేఖ రాస్తానని జీవీఎల్ తెలిపారు. అగ్రిగోల్డ్ బాధితులకు అండగా నిలిచేందుకు చేస్తోన్న ధర్మపోరాట దీక్షపై భవిష్యత్తు కార్యాచరణ కోసం ఈనెల 27న విశాఖపట్నంలో బహిరంగసభ నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

8 11

అగ్రిగోల్డ్‌ బాధితులకు ఎవరు అన్యాయం చేసినా ఉపేక్షించబోమని, కుటిల ప్రయత్నాలు చేస్తే జైలుకు వెళ్లక తప్పదని హెచ్చరించారు. ఐటీ కంపెనీల సమాచారం ప్రజలకు ఇవ్వాలంటే ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. ఆదాయ పన్ను శాఖ దాడులపై టీడీపీ నేతలు ఎందుకు భయపడుతున్నారని నిలదీశారు. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు లేవనెత్తిన అంశాలపై జీవీఎల్‌ను మీడియా ప్రశ్నించగా.. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో జరుగుతున్న అన్ని కుంభకోణాలు, అక్రమాలకు ఆయన మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నారని, త్వరలోనే అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu