జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ హస్తిన పర్యటనలో ఉన్నరు … ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై సోషల్ మీడియాలో సెటైర్లు వేశారు… కాళ్లకు ఇసుక బస్తాలు కట్టుకుని.. సీఎం నడుస్తున్నట్టుగా ఉన్న ఓ కార్టున్ను ట్విట్టర్లో పోస్ట్ చేశారు పవన్. సీఎం జగన్ గురించి ఢిల్లీలో ఇలాంటి అభిప్రాయమే ఉందంటూ కామెంట్ చేశారు. 151 స్థానాల్లో ప్రజలు వైసీపీని గెలిపించారని, కానీ కేవలం 5 నెలల్లోనే 35 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల ఉపాధి దెబ్బతిందని విమర్శించారు. 50 మంది కార్మికుల ప్రాణాలు కోల్పోయేలా చేసిన ఘనత వైసీపీకే దక్కుతంటూ పవన్ ఎద్దేవా చేశారు.
175 అసెంబ్లీ స్థానాలున్న అం.ప్ర – అసెంబ్లీ లో;151 అసెంబ్లీ స్థానాలలో ప్రజలు గెలిపిస్తే , వచ్చిన ఐదు నెలలు లోనే 35 లక్షల భవన నిర్మాణ కార్మికుల ఉపాధి ని తీసివేసి -ఏభై మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయేలా చేసిన ఘనత వైసీపీకే దక్కింది. pic.twitter.com/o4o4oaQYNV
— Pawan Kalyan (@PawanKalyan) November 16, 2019













