హీరోయిన్ కీర్తి సురేశ్ బాలీవుడ్లోకి అడుగుపెట్టబోతున్నారట. ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ నిర్మించబోయే చిత్రంలో ఆమె కీలక పాత్రలో నటించనున్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ‘బదాయి హో’ అనే సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న అమిత్ శర్మ.. ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారట. అయితే దీనిపై కీర్తి నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఈ ప్రాజెక్ట్ గురించి త్వరలో బోనీ కపూర్ స్వయంగా ప్రకటిస్తారని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఎ.ఆర్. మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన ‘సర్కార్’ సినిమాతో కీర్తి వెండితెరపై కనిపించారు. ఆ తర్వాత ఆమె నుంచి కొత్త సినిమాకు సంబంధించిన ఎలాంటి ప్రకటన రాలేదు. మరోపక్క సూపర్స్టార్ రజనీకాంత్కు జోడీగా నటించే అవకాశం దక్కించుకున్నట్లు గతంలో సినీ విశ్లేషకులు స్పష్టం చేశారు. ఎ.ఆర్. మురుగదాస్ తెరకెక్కించబోయే ఈ చిత్రంలో నయనతారతో పాటు కీర్తి సురేశ్ కూడా హీరోయిన్గా నటించనున్నారు. మలయాళీ సూపర్స్టార్ మోహన్లాల్తోనూ ఓ చిత్రంలో నటించనున్నారు ‘మహానటి’.