HomeTelugu Trendingవెటర్నరీ డాక్టర్ హత్యపై మహేశ్‌ బాబు ఆవేదన

వెటర్నరీ డాక్టర్ హత్యపై మహేశ్‌ బాబు ఆవేదన

2
వెటర్నరీ డాక్టర్‌ హత్యోదంతంపై యావత్తు దేశం భగ్గుమంటోంది. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు స్పందిస్తున్నారు. టాలీవుడ్‌ నుంచి బాలీవుడ్‌ వరకు మండిపడుతోంది. తాజాగా టాలీవుడ్‌ ప్రిన్స్‌ మహేష్‌ బాబు.. ఈ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మరిన్ని కఠిన చట్టాలు తేవాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ”రోజులు గడుస్తూనే ఉన్నాయి. పరిస్థితులు మాత్రం మారడం లేదు. ఒక సమాజంగా మనం విఫలమవుతున్నాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నా విన్నపం ఏంటంటే.. ఇలాంటి భయంకరమైన నేరాలను అరికట్టడానికి మరిన్ని కఠిన చట్టాలు తేవాల్సిన అవసరం ఉంది. బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. అంతా కలిసి మహిళలకు అండగా నిలుద్దాం.. భారతదేశాన్ని సురక్షితంగా మార్చుదాం” అని మహేష్‌ పిలుపునిచ్చారు. తన సందేశాలకు కేటీఆర్‌, ప్రధాన మంత్రి కార్యాలయాన్ని కూడా ట్యాగ్‌ చేశారు. అలాగే సామాజిక మాధ్యమాల్లో మహేష్ బాబు స్వరంతో ఉన్న ఓ సందేశం చక్కర్లు కొడుతోంది. అందులో ఆయన కవితా రూపంలో ఉన్న కొన్ని పంక్తుల్ని చదువుతూ.. మగాళ్లకు తమ బాధ్యతని గుర్తుచేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu