టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్- మాటల మాంత్రికుడు తివిక్రమ్ కాంబినేషన్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇప్పటికే వీరి కాంబోలో అతడు, ఖలేజా సినిమాలు వచ్చాయి. దాదాపు 12ఏళ్ళ తర్వాత వీళ్ళ కాంబోలో మూడో చిత్రం తెరకెక్కుతుంది. ఈ ఏడాది ప్రారంభంలోనే పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ మూవీ షూటింగ్ సోమవారం మొదలైంది.
రామోజీఫిలిం సిటీలో ‘SSMB28’ షూటింగ్ ప్రారంభమైంది. ఈ ఎపిసోడ్లో భారీ యాక్షన్ సన్నీవేశాలను తెరకెక్కించనున్నారట. తాజాగా ప్రొడ్యూసర్ నాగవంశీ ఈ సినిమా షూటింగ్ను ప్రారంభించినట్లు ట్వీట్ చేశాడు. పూజా హెగ్డే సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది. హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ పతాకంపై ఎస్.చినబాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 28న తెలుగు, తమిళంలో విడుదల కాబోతుంది.
The filming of an Epic Action Entertainer Begins today!🔥
The blockbuster combo of Superstar @urstrulymahesh & #Trivikram garu on sets after 12 years!! ✨⭐️
SUPERSTAR in a massy rugged avatar 🤩🤩
Await for more surprises coming your way, SOON!! #SSMB28Aarambham #SSMB28 pic.twitter.com/uu1J8L0xd3
— Naga Vamsi (@vamsi84) September 12, 2022