మాస్ మహారాజా రవితేజ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. రామారావు ఆన్ డ్యూటీ, ధమాకా, రావణాసుర సినిమాలతో పాటు రవితేజ నటిస్తున్న మరో చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’. వంశీ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాను అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇక ఈ సినిమాలో నుపూర్ సనన్, గాయత్రీ భరద్వాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ఇక ఏప్రిల్ 2వ తారీకున ఈ సినిమా ముహూర్తంను, టైగర్ నాగేశ్వరరావు లుక్ ను రివీల్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా మరో సర్ ప్రైజ్ అప్డేట్ ని మేకర్స్ రివీల్ చేశారు. టైగర్ నాగేశ్వరరావు ఓపెనింగ్ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా రానున్నట్లు మేకర్స్ తెలిపారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. అయితే ఆ వేడుక ఎప్పుడు జరగనుందో ఏప్రిల్ 2 న తెలియజేయనున్నారు. ఇకపోతే రవితేజ, చిరు నటిస్తున్న మెగా 154 లో ఒక కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.