HomeTelugu Trendingకార్మికుల సమ్మెపై తెలంగాణ ఆర్టీసీ ఎండీకి నోటీసులు

కార్మికుల సమ్మెపై తెలంగాణ ఆర్టీసీ ఎండీకి నోటీసులు

10 7తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెపై జాతీయ బీసీ కమిషన్ స్పందించింది.. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, ఆర్టీసీ ఎండీకి నోటీసులు జారీ చేసింది… ఈ నెల 25వ తేదీన వ్యక్తిగతంగా కమిషన్ ముందు హాజరుకావాలని ఆదేశించింది. ఆర్టీసీ జేఏసీ ఫిర్యాదు మేరకు ఈ నోటీసులు ఇచ్చింది కమిషన్‌.. ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని.. కార్మికులంతా సెల్ఫ్ డిస్మిస్ అయినట్టేనని ప్రకటించిందని ఫిర్యాదు చేశారు. ఇప్పటికే ఓ బీసీ కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిపారు. ఆర్టీసీలో 20 వేల మందికి పైగా బీసీలు ఉన్నట్టు తెలిపారు.. వారతంగా తీవ్ర ఒత్తిడికి గురవుతున్నట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు జేఏసీ నేతలు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu