లేడీ సూపర్ స్టార్ నయనతార- విఘ్నేశ్ శివన్ల వివాహం గురువారం అంగరంగ వైభవంగా జరిగింది. వివాహానంతరం ఈ నూతన దంపతులు నేడు(జూన్ 9న) తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నయనతార కొత్త వివాదంలో చిక్కుకుంది. గుడి ప్రాంగణంలో ఆమె చెప్పులు వేసుకుని తిరిగింది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలోవైరల్గా మారాయి.
స్వామివారు కొలువు తీరిన ప్రాంతంలో ఉన్న మాడవీధులు ఎంతో పవిత్రమైనవి. ఇలాంటి పవిత్రమైన ప్రదేశంలో ఇవేం పనులు అంటూ నయన్పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫొటోషూట్కు తిరుమల ఆలయం వేదికనుకుంటున్నారా? అని ఫైర్ అవుతున్నారు. వెంటనే చేసిన తప్పుతెలుసుకుని స్వామివారిని క్షమాపణ కోరండని కామెంట్స్ చేస్తున్నారు.
#WikkyNayan From #Tirupati #Nayanthara #VigneshShivan #Nayantharawedding #NayantharaMarriage pic.twitter.com/Y4SlK813yf
— NAYANTHARA FC KERALA (@NayantharaFCK) June 10, 2022
ఈ వ్యవహారంపై తాజాగా తిరుపతి తిరుమల దేవస్థానం (టీటీడీ) స్పందించింది. శ్రీవారి ఆలయం సమీపంలోనే నయనతార దంపతుల ఫొటోషూట్పై టీటీడీ ఆగ్రహం వ్యక్తం చేసింది. నయనతార కాళ్లకు చెప్పులతోనే మాడ వీధుల్లో సంచరించడం దురదృష్టకరనమని వ్యాఖ్యానించింది. తిరుమల పవిత్రతకు భంగం కలిగేలా వ్యవహరించిన నయనతార దంపతులపై పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నామని టీటీడీ ప్రకటించింది. వారిపై ఏఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేయవచ్చన్న విషయంపై చర్చిస్తున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు.