HomeTelugu Newsఎన్టీఆర్‌కు ఈసారీ దక్కని భారతరత్న

ఎన్టీఆర్‌కు ఈసారీ దక్కని భారతరత్న

9 20
ఎన్ని పర్యాయాలు, ఎన్ని అభ్యర్ధనలు చేసినా ఎన్టీఆర్‌కు భారతరత్న ప్రకటించడంలో కేంద్రంలో అధికారంలో ఉండే ప్రభుత్వాలు తాత్సారం చేస్తున్నాయని తన సందేశంలో సీఎం చంద్రబాబు తెలిపారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి “భారతరత్న” దక్కడం సముచిత గౌరవమని అన్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా ఏపీ ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాస్వామ్యానికి ఎప్పటికప్పుడు పెను సవాళ్లు ఎదురవుతున్నా దేశ ప్రజలు వాటిని ఎంతో సంయమనంతో, సమష్టి భావనతో ఎదుర్కొంటున్నాం. ఇప్పుడు ప్రజాస్వామ్యానికి మరో రూపంలో ప్రమాదం ఎదురైందని, పాలకుల నియంతృత్వ పోకడల వల్ల దేశంలోని అన్ని రాజ్యాంగ వ్యవస్థల మనుగడకు విఘాతం ఏర్పడిందని పేర్కొన్నారు. కేంద్ర-రాష్ట్రాల మధ్య ఉండాల్సిన సమాఖ్య భావన కనిపించకుండా పోతోంది. 17వ లోక్‌సభకు జరగనున్న ఎన్నికలు జాతి భవితను నిర్ధేశించే ఎన్నికలు కానున్నాయి. ఎన్నో ఆశలు, లక్ష్యాలకు కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం తూట్లు పొడిచింది. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే వారికి పట్టం కట్టాల్సిన కీలక బాధ్యతను ఈ గణతంత్రం ప్రజల ముందు ఉంచిందని తన సందేశంలో చంద్రబాబు నాయుడు తెలిపారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu