HomeTelugu Big StoriesAyodhya Ram Mandir Inauguration: నా కళ్లలో నుంచి నీళ్లు వచ్చాయి: పవన్‌ కళ్యాణ్‌

Ayodhya Ram Mandir Inauguration: నా కళ్లలో నుంచి నీళ్లు వచ్చాయి: పవన్‌ కళ్యాణ్‌

pawan kalyan emotion in Ayo

Ayodhya Ram Mandir Inauguration: ఈరోజు అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈ మహోత్తర కార్యం జరిగింది. ఈ రామమందిర ప్రారంభోత్సవానికి టాలీవుడ్ నుంచి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. చిరంజీవి, పవన్ కల్యాణ్, రామ్‍చరణ్ ఈ వేడుకకు హాజరయ్యారు. ప్రాణప్రతిష్ఠ తర్వాత మీడియాతో మాట్లాడారు పవన్ కల్యాణ్.

‘ఇది నాకు చాలా భావోద్వేగమైనది. ప్రాణప్రతిష్ఠ సమయంలో నా కళ్లలో నుంచి నీళ్లు రావడం ప్రారంభించింది. ఇది చాలా ఎమోషనల్. కొన్ని తరాల నుంచి దేశం ఎదుర్కొన్న బాధ ఇది. ఎట్టకేలకు ఇది నెరవేరింది. భారత్‍గా దేశాన్ని ఇది పటిష్టం చేస్తుంది. ఐక్యం చేస్తుంది.

దక్షిణాదిలో మేం ఎప్పుడూ తిరుమలకే వెళ్లాలనుకుంటాం. ఇప్పటి నుంచి అయోధ్యకు కూడా రావాలనుకుంటాం. అయోధ్య కోసం రానున్న కాలంలో ఏదో ఒకటి చేస్తాం’ అని ఏఎన్‍ఐతో పవన్ కల్యాణ్ చెప్పారు. ప్రాణప్రతిష్ఠకు హాజరయ్యేందుకు ఆదివారమే అక్కడికి చేరుకున్నారు పవన్ కల్యాణ్. 500 ఏళ్ల కల సాకారమవుతోందని ఆయన చెప్పారు.

రామమందిరం ముందు సెల్ఫీ దిగిన ఫొటోను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు పవన్. రామ కార్యం అంటే రాజ్య కార్యం, ప్రజాకార్యం.. జై శ్రీరామ్ అని పేర్కొన్నారు.

రామమందిర ప్రాణ ప్రతిష్ఠకు బాలీవుడ్ స్టార్లు అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, రణ్‍బీర్ కపూర్, ఆలియాభట్, విక్కీ కౌశల్, కత్రినా కైఫ్, కంగనా రనౌత్ హాజరయ్యారు. తమిళ సూపర్ స్టార్ తలైవా రజినీ కాంత్ కూడా వచ్చారు.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu