HomeTelugu Big StoriesPindam: త్వరలో ఓటీటీలో కి 'పిండం' మూవీ

Pindam: త్వరలో ఓటీటీలో కి ‘పిండం’ మూవీ

pindam movie coming soon onPindam: శ్రీరామ్ హీరోగా, ఖుషి రవి ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన తాజా చిత్రం ‘పిండం’. ‘ది స్కేరియస్ట్ ఫిల్మ్’ అనేది ఉప శీర్షిక. సాయికిరణ్ దైదా ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమైయడు. ఈ మూవీ గ‌త ఏడాది డిసెంబ‌ర్ 15న ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి యావ‌రేజ్‌గా నిలిచింది. తాజాగా ఈ చిత్రంకు సంబంధించి ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ప్రకటించారు.

ప్ర‌ముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహా వేదిక‌గా పిండం సినిమా త్వరలోనే స్ట్రీమింగ్ కానున్న‌ట్లు చిత్ర‌బృందం సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌క‌టించింది. కళాహి మీడియా పతాకం పై యశ్వంత్‌ దగ్గుమాటి ఈ సినిమాను నిర్మించారు. శ్రీరామ్‌తో పాటు, ఈశ్వరీరావు, రవివర్మ, మాణిక్ రెడ్డి, బేబీ చైత్ర, బేబీ ఈషా, విజయలక్ష్మి, శ్రీలత త‌దిత‌రులు ఈ సినిమాలో కీల‌క పాత్ర‌లు పోషించారు.

ఓ మారుమూల ప‌ల్లెటురిలో చాలా రోజులుగా ఎవరూ నివసించని ఒక‌ ఇంట్లోకి హీరో శ్రీరామ్ త‌న‌ కుటుంబంతో వస్తాడు. అయితే ఆ ఇంట్లో అడుగుపెట్టిన అనంత‌రం వారికి అనుకోని సంఘటనలు ఎదురవుతుంటాయి. ఇంట్లో ఉన్న‌ ఆత్మ.. శ్రీరామ్ కుటుంబానికి నిద్ర లేకుండా, ప్రాణ భయంతో వణికిపోయేలా చేస్తుంది.

ఆ టైమ్‌లో వారికి సాయం చేయడానికి మంత్రగత్తె ఈశ్వరీ రావు వ‌స్తుంది. అయితే ఆ ఇంట్లో ఏం జరుగుతుంది? ఆ ఆత్మల కథ ఏంటి? వాటి నుంచి శ్రీరామ్ కుటుంబాన్ని ఈశ్వరీ రావు రక్షించిందా? అనేది కథ. ఈ మూవీ నుండి విడుదలైన ట్రైలర్‌, అప్డేట్స్‌ ఈ సినిమాపై ఆసక్తిని కలిగించాయి. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి అలరించడానికి రెడీ అయిపోయింది.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu