HomeTelugu Trendingప్రభుదేవా మైడియర్ భూతం

ప్రభుదేవా మైడియర్ భూతం

Prabhu Deva Mydear Bhutam

ప్రభు దేవా ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మై డియర్ భూతం’. డిఫరెంట్ కథతో కిడ్స్ ఫాంటసీ మూవీగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. అభిషేక్ ఫిలిమ్స్ బ్యానర్‌పై రమేష్ పిళ్ళై నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమిళ దర్శకుడు ఎన్. రాఘవన్ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీలక్ష్మి జ్యోతి క్రియేషన్స్ అధినేత ఏఎన్ బాలాజీ ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి కావడంతో ప్రచార కార్యక్రమాలు చేస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేశారు.

మాస్టర్ ఓ మై మాస్టర్ అంటూ ఫాస్ట్ బీట్‌‌తో సాగిపోతున్న ఈ సాంగ్ లో ప్రభుదేవా తనదైన స్టైల్‌లో ఆకట్టుకున్నారు. నీ మనసు కన్న కళలు అన్నీ చూసేయ్.. చూసేయ్.. నిన్ను మించినోడు లేనేలేడు ఆడేయ్ పాడేయ్ అంటూ రాసిన లిరిక్స్ అద్భుతంగా ఉన్నాయి. ఈ పాటను అరవింద్ అన్నెస్ట్ పాడగా.. డాక్టర్ చల్లా భాగ్యలక్ష్మి లిరిక్స్ అందిచారు. రాజేష్, డి. ఇమ్మాన్ అందించిన బాణీలు అందించారు. ఈ పాట సినిమా మొత్తానికే హైలైట్‌గా నిలుస్తుందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ సాంగ్ నెట్టింట వైరల్‌గా మారింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu