HomeTelugu Newsనిర్మాత 'అల్లు అరవింద్‌కు అరుదైన గౌరవం..

నిర్మాత ‘అల్లు అరవింద్‌కు అరుదైన గౌరవం..

10 13
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌కు అరుదైన గౌరవం దక్కింది. భారత, తెలుగు చిత్ర పరిశ్రమకు నిర్మాతగా ఆయన చేసిన సేవను గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం ‘ఛాంపియన్స్‌ ఆఫ్‌ ఛేంజ్‌ 2019’ అవార్డుతో సత్కరించింది. భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఈ అవార్డును అల్లు అరవింద్‌కు అందించారు. ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో సోమవారం జరిగిన కార్యక్రమంలో ప్రణబ్‌ చేతుల మీదుగా అల్లు అరవింద్‌ గౌరవం అందుకున్నారు. ఈ నేపథ్యంలో సోషల్‌మీడియాలో నెటిజన్లు అల్లు అరవింద్‌కు శుభాకాంక్షలు చెబుతున్నారు.

గీతా ఆర్ట్స్‌ సంస్థ వరుస సినిమాలతో హిట్లు అందుకుంటోంది. ఈ సంస్థ నుంచి వచ్చిన చిత్రాలు విజయం సాధించాయి. గత ఏడాది ‘గీత గోవిందం’, ఈ ఏడాది ‘అల వైకుంఠపురములో..’ సినిమాలతో ప్రేక్షకులకు వినోదం పంచింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu