బాలీవుడ్లో బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా, ఆయుష్మాన్ ఖురానాకు జాతీయ అవార్డును గెలిచిన చిత్రం ‘అంధాదున్’. ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయబోతున్నారు. హీరోగా నితిన్ నటిస్తున్నాడు. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నా ఈ సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. లాక్డౌన్ కారణంగా ప్రస్తుతం అన్నీ సినిమా షూటింగ్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రియాంక అరుళ్ మోహన్ను ఎంపిక చేసే ఆలోచనలో ఉందట మూవీ యూనిట్. కాగా నాని గ్యాంగ్ లీడర్ సినిమాలో ఈ భామ హీరోయిన్గా నటించింది. ఈ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల్నిమెప్పించింది ప్రియాంక. మరి నితిన్ సరసన ఎలా మెప్పిస్తుందో చూడాలి.