రఫేల్ ఒప్పందానికి సంబంధించిన లోక్సభలో అధికార, ప్రతిపక్షాల మధ్య వాడీవేడీగా చర్చ జరుగుతోన్న సమయంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్గాంధీ మరోసారి కన్నుకొట్టి కెమెరాకు చిక్కారు. రఫేల్పై చర్చ సందర్భంగా తమిళనాడు అన్నాడీఎంకే నేత ఎం.తంబిదురై మాట్లాడుతుండగా రాహుల్ బల్లపై చరిచి అభినందించారు. ఆ తర్వాత వెనక ఉన్న నేతతో ఏదో అంటూ కన్ను కొట్టారు. అది కాస్తా కెమెరా కంటికి చిక్కి మరోసారి వైరల్గా మారింది.
గతేడాది జులైలో ఎన్డీయే ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టిన సమయంలో చర్చ జరుగుతుండగా ఇదే విధంగా రాహుల్ కన్నుకొట్టారు. సభలో రాహుల్ ప్రసంగించిన తర్వాత నేరుగా ప్రధాని నరేంద్రమోడీ దగ్గరకు వెళ్లి హఠాత్తుగా ఆలింగనం చేసుకొని అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆ తర్వాత సీట్లోకి వచ్చి కూర్చున్న రాహుల్ జ్యోతిరాదిత్య సింధియాతో మాట్లాడుతూ కన్నుకొట్టారు. అప్పట్లో ఈ వీడియో వైరల్గా మారింది. లోక్సభలో హుందాగా వ్యవహరించాల్సిన ఎంపీ తన చిన్న పిల్లల చేష్టలు చూపించారంటూ బీజేపీ నేతలు విమర్శలు గుప్పించారు.
ఇదిలా ఉంటే.. రఫేల్పై చర్చ సమయంలో ఒకానొక సందర్భంగా గతంలో రాహుల్ కన్నుకొట్టిన అంశాన్ని సీతారామన్ ప్రస్తావించారు. మోడీని కౌగిలించుకుని కన్నుకొట్టిన తర్వాత ప్రధానికి మీరు క్షమాపణలు చెప్పారా? అని ఆమె ప్రశ్నించారు. అలా మాట్లాడిన తర్వాతే రాహుల్ ఈ విధంగా కన్నుకొడుతూ కెమెరాకు చిక్కడం గమనార్హం
Rahul Gandhi ‘winks’ again… This time during the all serious debate on #Rafale. He surely needs help! pic.twitter.com/rncFdTlphU
— Amit Malviya (@amitmalviya) January 4, 2019