బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ మృతి కేసులో డ్రగ్స్ కోణం సంచలనాలకు తెరలేపుతుంది. సుశాంత్ మృతి కేసు దర్యాప్తులో భాగంగా సీబీఐతో పాటు ఈడీ, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) రంగంలోకి దిగి కీలక ఆధారాలు సేకరిస్తున్నాయి. డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తిని కస్టడీలోకి తీసుకొని ఎన్సీబీ విచారణ చేస్తోంది. ఎన్సీబీ విచారణలో భాగంగా రియా కొందరు బాలీవుడ్ నటుల పేర్లు బయటపెట్టినట్టు తెలుస్తోంది. డ్రగ్స్ మాఫియాతో సంబంధాలున్న వారిలో ఎక్కువగా బాలీవుడ్ టాప్ హీరో హీరోయిన్లే ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.జాతీయ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం సారా అలీఖాన్తో పాటు రకుల్ ప్రీత్ సింగ్, డిజైనర్ సైమన్ కంబట్టా, సుషాంత్ ఫ్రెండ్, మాజీ మేనేజర్ రోహిణి అయ్యర్, ఫిలిం మేకర్ ముఖేష్ ఛబ్రాపై డ్రగ్స్ వినియోగించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం వికారాబాద్ శివార్లలో ఓ సినిమా షూటింగ్ లో పాల్గొంటుంది రకుల్ ప్రీత్ సింగ్. డ్రగ్స్ కేసులో తన పేరు బయటకు రావడంతో షూటింగ్ స్పాట్ నుంచి రకుల్ వెళ్లిపోయిందని తెలుస్తుంది. జూబ్లీహిల్స్ లోని తన ఇంటినుంచి మూడురోజుల క్రితం షూటింగ్ కు వెళ్ళింది రకుల్. అయితే ఆమెపై వస్తున్న ఆరోపణలను రకుల్ మేనేజర్ తీవ్రంగా ఖండిస్తున్నారు. తనపై కుట్రతో ఇదంతా చేస్తున్నారని వాదిస్తున్నారు.