HomeTelugu Newsఅడవులకు వెళ్లిన రకుల్ ప్రీత్

అడవులకు వెళ్లిన రకుల్ ప్రీత్

Rakul Preet in Vikarabad fo

కరోనా కారణంగా నటులందరూ ఇంటికే పరిమితమైన సంగతి తెలిసిందే. టాలీవుడ్‌లో రకుల్‌ప్రీత్‌ సింగ్‌కు అవకాశాలు తక్కువ కావడంతో బాలీవుడ్‌పై దృష్టి పెట్టింది. చివరగా తెలుగులో మన్మథుడు-2 మూవీలో నాగార్జునతో రొమాన్స్ చేసింది. ఆ తర్వాత ఓ వేశ్య పాత్ర చేసేందుకు అంగీకారం తెలిపిoదట. ముంబై రెడ్ లైట్ ఏరియాకు చెందిన ప్రముఖ వేశ్య జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం రూపొందనున్నట్లు సమాచారం. అయితే కొన్ని నెలలుగా షూటింగ్‌లకు దూరంగా ఉన్న రకుల్ నేరుగా ముంబై నుంచి ఫ్లైట్‌లో తెలంగాణలోని వికారాబాద్ అడవులకు వెళ్లిందట. ఎందుకంటే ఆహా ఓటీటీ కోసం డైరెక్టర్ క్రిష్ రూపొందిస్తున్న ఓ వెబ్ సిరీస్ షూటింగ్‌లో పాల్గొనేందుకు వెళ్లిందట. లాక్‌డౌన్ తర్వాత రకుల్ ముందుగా పాల్గొన్న షూటింగ్ ఇదే. అయితే దీనికి సంబంధించిన షూటింగ్ చాలా సీక్రెట్‌గా రూపొందిస్తున్నారట. ఓ వారంపాటు షెడ్యూల్ ఉండొచ్చని
అంటున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu