కరోనా కారణంగా నటులందరూ ఇంటికే పరిమితమైన సంగతి తెలిసిందే. టాలీవుడ్లో రకుల్ప్రీత్ సింగ్కు అవకాశాలు తక్కువ కావడంతో బాలీవుడ్పై దృష్టి పెట్టింది. చివరగా తెలుగులో మన్మథుడు-2 మూవీలో నాగార్జునతో రొమాన్స్ చేసింది. ఆ తర్వాత ఓ వేశ్య పాత్ర చేసేందుకు అంగీకారం తెలిపిoదట. ముంబై రెడ్ లైట్ ఏరియాకు చెందిన ప్రముఖ వేశ్య జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం రూపొందనున్నట్లు సమాచారం. అయితే కొన్ని నెలలుగా షూటింగ్లకు దూరంగా ఉన్న రకుల్ నేరుగా ముంబై నుంచి ఫ్లైట్లో తెలంగాణలోని వికారాబాద్ అడవులకు వెళ్లిందట. ఎందుకంటే ఆహా ఓటీటీ కోసం డైరెక్టర్ క్రిష్ రూపొందిస్తున్న ఓ వెబ్ సిరీస్ షూటింగ్లో పాల్గొనేందుకు వెళ్లిందట. లాక్డౌన్ తర్వాత రకుల్ ముందుగా పాల్గొన్న షూటింగ్ ఇదే. అయితే దీనికి సంబంధించిన షూటింగ్ చాలా సీక్రెట్గా రూపొందిస్తున్నారట. ఓ వారంపాటు షెడ్యూల్ ఉండొచ్చని
అంటున్నారు.