HomeTelugu Newsబ్రహ్మాస్త్ర సినిమా ప్రమోషన్ కోసం విశాఖ చేరుకున్న రణబీర్ కపూర్

బ్రహ్మాస్త్ర సినిమా ప్రమోషన్ కోసం విశాఖ చేరుకున్న రణబీర్ కపూర్

Ranbir kapoor reaches visak
బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్.. బ్రహ్మాస్త్ర సినిమా ప్రచార కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఉదయం విశాఖపట్టణంకు విచ్చేశారు. ఈ సందర్భంగా అభిమానుల నుంచి ఆయనకు అపూర్వ స్వాగతం లభించింది. కారులో నుంచే పైన రూఫ్ గార్డ్ ఓపెన్ చేసి నించున్నారు. ఫ్యాన్స్‌కు అభివాదం చేశారు. ఈ సందర్భంగా క్రేన్ సాయంతో ఆయనకు భారీ పూలమాల వేసి అభిమానులు సత్కరించారు.

ఘనమైన ఆహ్వానాన్ని చూసిన రణబీర్ కపూర్ సైతం సంతోషం వ్యక్తం చేశారు. కొంత మంది అభిమానులకు షేక్ హ్యండ్ ఇచ్చారు. అలియా భట్ ఎక్కడ? అంటూ కొందరు అభిమానులు ప్రశ్నించారు. రణబీర్ కపూర్, అలియా భట్ ఈ సినిమాలో జంటగా నటించారు. అలాగే, ఈ ఏడాది ఏప్రిల్ 14న ఈ జంట వివాహం చేసుకోవడం తెలిసిందే. పెళ్లి తర్వాత వీరి నుంచి వస్తున్న తొలి సినిమా ఇదే కానుంది. దీనికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. అక్కినేని నాగార్జున, అమితాబ్ బచ్చన్ వంటి ఎందరో ఈ సినిమాలో కనిపించనున్నారు. విశాఖ పర్యటనలో కపూర్ వెంట అయాన్ ముఖర్జీ కూడా ఉన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu