HomeTelugu Trendingఎస్‌. జానకి మరణ వార్తలపై బాలసుబ్రహ్మాణ్యం ఫైర్‌..

ఎస్‌. జానకి మరణ వార్తలపై బాలసుబ్రహ్మాణ్యం ఫైర్‌..

1 27
ప్రముఖ గాయని ఎస్. జానకి నిన్న రాత్రి మరణించారంటూ సోషల్ మీడియాలో వైరల్ అయిన వార్తలపై గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఘాటుగా స్పందించారు. ఏంటీ చెత్త రాతలంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ ఉదయం నుంచి తనకు ఎన్నో ఫోన్లు వచ్చాయని, వారంతా జానకి గారికి ఏమైందని ప్రశ్నించారని తెలిపారు.

కొంతమంది ఏ మాత్రమూ విచక్షణ లేకుండా ప్రవర్తిస్తున్నారని, సినీ కళాకారుల ఫ్యాన్స్ కు ఇటువంటి వార్తలు వింటే గుండెపోటు వచ్చే అవకాశాలు ఉన్నాయని, అటువంటిది ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. తాను స్వయంగా జానకమ్మతో మాట్లాడానని, ఆవిడ చాలా బాగున్నారని వ్యాఖ్యానించారు బాలసుబ్రహ్మాణ్యం. సామాజిక మాధ్యమాలను వినోదం కోసం. చెడు విషయాలను ప్రచారం చేయడం కోసం వాడవద్దని, పాజిటివిటీ కోసమే వాడాలని కోరారు. కాగా, జానకి ఆరోగ్యం బాగుందని వారి కుటుంబ సభ్యులు కూడా వివరణ ఇచ్చిన సంగతి తెలిసిందే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu