టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, హీరోయిన్ చాందిని చౌదరిలు జంటగా నటించిన తాజా చిత్రం ‘సమ్మతమే’. గోపీనాథ్రెడ్డి డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా ఇటీవల జూన్ 24న విడుదలైంది. ఈ మూవీ ఓటీటీలో సందడి చేసేందుకు రెడీ అయ్యింది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ఫాం ఆహాలో సమ్మతమే మూవీ త్వరలో విడుదల కాబోతోంది. దీనిపై సదరు ఓటీటీ సంస్థ తాజాగా అధికారిక ప్రకటన ఇచ్చింది. జూలై 15 అర్థరాత్రి నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కానుందంటూ ఆహా తమ అధికారిక ట్విటర్లో వెల్లడిచింది. యూజీ ప్రొడక్షన్స్ బ్యానరపై కంకణాల ప్రవీణ నిర్మించిన ఈ చిత్రం విడుదలైన రెండు వారాలకే ఓటీటీలోకి రావడం గమనార్హం.
Krishnudi leelalu, Sathyabhama alakalu kathale vinamu ipativaraku kani ade role reverse aithe?#SammathameOnAHA premieres July 15.@Kiran_Abbavaram @iChandiniC #GopinathReddy #DivyaSree pic.twitter.com/DQ4v2zlCha
— ahavideoin (@ahavideoIN) July 6, 2022