బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ అనారోగ్యం కారణంగా షూటింగ్లకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా సంజయ్దత్ ఆరోగ్యం గురించి సోషల్ మీడియాలో పలు వార్తలు హల్చల్ చేస్తున్నాయి. తాజాగా సంజయ్దత్తో ఓ అభిమాని దిగిన ఫొటో ఒకటి వైరల్ అవుతోంది. ఇందులో చాలా బలహీనంగా ఉన్నట్టు కనిపిస్తున్నాడు సంజయ్దత్. అతని భార్యతో కలిసి దుబాయ్లో ఉంటున్న పిల్లలతో గడుపుతున్నాడు. మున్నాభాయ్ క్యాన్సర్ బారిన పడిన సంగతి తెలిసిందే. ఆయనకు లంగ్ క్యాన్సర్ అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నట్లు వైద్యులు తేల్చారు. ఇప్పటికే ముంబైలో తొలిదశ కీమో థెరపీని చేయించుకున్నారు. సంజయ్ దత్ అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలంటూ పోస్టులు చేస్తున్నారు. కేజీఎఫ్-2లో అధీర పాత్రలో చేస్తున్నారు. సంజయ్ దత్ నటించిన భుజ్ ద ఫ్రైడ్ ఆఫ్ ఇండియా త్వరలో విడుదల కానుంది.