HomeTelugu Trending'రణరంగం' సీక్వెల్‌?

‘రణరంగం’ సీక్వెల్‌?

7 11

యంగ్‌ హీరో శర్వానంద్‌ నటించిన సినిమా ‘రణరంగం’. ఈ చిత్రం ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో కాజల్‌, కల్యాణి ప్రియదర్శన్‌ హీరోయిన్‌లుగా నటించారు. సుధీర్‌ వర్మ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ చిత్రం గురించి ఓ ఆసక్తికర విషయాన్ని దర్శకుడు సుధీర్‌ వర్మ బయటపెట్టారు. ‘రణరంగం’ చిత్రానికి సీక్వెల్‌ ఉండబోతోందని తెలిపారు. ఈ ఐడియా సుధీర్‌కు శర్వా ఇచ్చాడట. ‘రణరంగం’ చిత్రం ఆశించిన విజయం సాధిస్తే దీనికి కచ్చితంగా సీక్వెల్‌ ఉంటుంది. ప్రేక్షకుల స్పందన ఆధారంగా రెండో భాగాన్ని ప్రారంభిస్తామ’ని దర్శకుడు తెలిపారు. ‘రణరంగం’ చిత్రంలో శర్వానంద్‌ పాత్ర రెండు భిన్న కోణాల్లో సాగనుంది. ప్రశాంత్‌ పిళ్లై ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ నిర్మిస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu