HomeTelugu Trendingఓటీటీలోకి 'సన్‌ ఆఫ్‌ ఇండియా'....?

ఓటీటీలోకి ‘సన్‌ ఆఫ్‌ ఇండియా’….?

Manchu Mohan Babu Announced Mohan Babu University In Tirupati

విలక్షణ నటుడు మోహన్‌ బాబు ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం సన్‌ ఆఫ్ ఇండియా. దేశభక్తి ప్రధానంగా సాగే కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీకి డైమండ్‌ రత్నబాబు దర్శకత్వం వహించారు. మంచు విష్ణు నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాలో మీనా, ప్రజ్ఞా జైస్వాల్‌, శ్రీకాంత్, అలీ, తనికెళ్ల భరణి తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమా అనుకునంతా విజయం సాధించలేక పోయింది…

తాజాగా ఈ సినిమా డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లోకి అడుగుపెట్టింది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో మంగళవారం (మే 17) నుంచి స్ట్రీమింగ్‌ అవుతోంది. ఈ సినిమాకు ఇళయరాజా సంగీతం అందించగా, సర్వేష్‌ మురారి ఛాయాగ్రహణం బాధ్యతలు నిర్వర్తించారు. అంతేకాకుండా ఈ మూవీకి మోహన్‌ బాబు స్క్రీన్‌ప్లే అందించడం విశేషం.

Recent Articles English

Gallery

Recent Articles Telugu