HomeTelugu Trending'మా' వివాదంపై శ్రీరెడ్డి కామెంట్స్‌.. నరేష్‌పై దారుణ వ్యాఖ్యలు

‘మా’ వివాదంపై శ్రీరెడ్డి కామెంట్స్‌.. నరేష్‌పై దారుణ వ్యాఖ్యలు

2 21‘మా’ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో జరుగుతున్న వివాదంలోకి నటి శ్రీరెడ్డి ఎంట్రీ ఇచ్చింది. మా అధ్యక్షుడు నరేష్ మీద తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు మాలో పెద్ద దుమారం రేపిన శ్రీరెడ్డి ఇప్పుడు తాజాగా నరేష్, జీవిత రాజశేఖర్ మధ్య జరుగుతున్న వివాదంపై స్పందించారు. మా ఎన్నికల సమయంలో జీవితారాజశేఖర్ మీద తీవ్ర వ్యాఖ్యలు చేసిన శ్రీరెడ్డి.. ఇప్పుడు నరేష్ మీద విరుచుకుపడ్డారు. తన ఫేస్ బుక్ ఖాతాలో ఓ కామెంట్ పోస్ట్ చేశారు. ‘నరేష్ సగం గోసి నువ్వే విప్పేసుకున్నావ్. సగం గోసి మా మెంబర్స్ లాగేశారు.’ అని పోస్ట్ చేసిన ఆమె ఆ తర్వాత మరో బూతం పదం వాడారు.

ఇటీవల మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌‌లో విబేధాలు పొడచూపాయి. మా అసోసియేషన్‌‌కు అధ్యక్షుడుగా నరేష్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా రాజశేఖర్, జీవితా సెక్రటరీగా ఉన్నారు. అయితే, ఫండ్స్‌కు సంబంధించి వారి మధ్య విబేధాలు వచ్చాయి. గత 9నెలలుగా మాలో ఏం జరుగుతుంది ? ఎంత ఫండింగ్ అందింది? ఎలాంటి ఈవెంట్లు జరుగుతున్నాయి అన్న దానిపై జీవితా రాజశేఖర్ అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. నరేష్, జీవితా రాజశేఖర్ మధ్య దూరం మరింత పెరుగుతోంది. ఈ క్రమంలో అధ్యక్షుడు నరేష్ లేకుండానే ఫిల్మ్‌ఛాంబర్‌లో సమావేశం ఏర్పాటు చేశారు. అందరిని ఈ మీటింగ్‌కు రావాలని జీవితా రాజశేఖర్ మెసేజ్ అందించారు. దీంతో నరేష్ మినహా మిగిలినవారంతా సమావేశానికి హాజరయ్యారు. అయితే నరేష్ తరపు న్యాయవాది మాత్రం అధ్యక్షుడు లేకుండా సమావేశం ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. ఈ సమావేశంలో గొడవ జరగడంతో పరుచూరి గోపాలకృష్ణ ఏడుస్తూ వెళ్లపోయారనే ప్రచారం జరిగింది. అయితే, అది తప్పుడు ప్రచారం అని గోపాలకృష్ణ ఖండించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu